టీవీ: అందరి ముందు హైపర్ ఆది పరువు తీసిన ఇంద్రజ..!!

Divya
బుల్లితెరపై ఈటీవీ లో ప్రసారమయ్యే పలు షోలు బాగా పాపులర్ అయ్యాయి. ఇక అంతే కాకుండా ఈటీవి లో ప్రసారమయ్యే ఈ షో లకోసం ఎంతోమంది ప్రేక్షకులు వీటిని చూడడానికి ఆత్రుతగా ఉంటారు. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ, స్పెషల్ ప్రోగ్రామ్స్ వంటివి బాగా హైలెట్గా నిలుస్తూ ఉంటాయి. ఇక తాజాగా ఈటీవీ 27వ వార్షికోత్సవం సందర్భంగా ఒక సరికొత్త ప్రోగ్రామ్ ను తీసుకువస్తోంది మల్లమాల సంస్థ. ఇక ఇందులో జబర్దస్త్ ఆర్టిస్టులు, సినీ సెలబ్రిటీలు సైతం హాజరు కావడం జరిగింది. ఇక ఎంతోమంది కూడా ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి వేసే పంచులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.

ఇక యాంకర్ ప్రదీప్, సుధీర్, హైపర్ ఆది, రామ్ ప్రసాద్ తదితరులు ఈ షో లో ఒకరిని మించి మరొకరు డైలాగులతో, కౌంటర్ తో బాగా రెచ్చిపోయారు. ఇక ఇందులో జడ్జిగా ఇంద్రజ కూడా రావడం జరిగింది. ఇక ఇందులో పోసాని హైపర్ ఆది నీ వాట్సాప్ లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు చూపించు అని అడగగా.. ఆది సైలెంట్ గా ఉన్నారు.. ఇక ఇంతలో ఇంద్రజ మధ్యలోకి దూరి ఆయనను అలా అడగకూడదు ఆయన ఫోన్లో అన్నీ కూడా ఎక్కువగా లేడీస్ నెంబర్లే ఉంటాయి అని కౌంటర్ ఇచ్చింది. కేవలం ఒకటో రెండో అబ్బాయిల నెంబర్లు తప్ప.. మిగిలినవన్నీ అమ్మాయిల నెంబర్ లే అంటూ ఇంద్రజ దారుణంగా పంచువేసింది. దీంతో హైపర్ ఆది ఏం మాట్లాడాలో తెలియక చాలా సైలెంట్ గా ఉండిపోయారు.
మొత్తానికి హైపర్ ఆది చుట్టూ అందరు చేరి చాలా ఫన్నీగా ప్రేక్షకులను నవ్వించడం కోసం బాగా ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ క్రమంలో రామ్ ప్రసాద్ అల్లరి హైపర్ ఆది పంచులు సుధీర్ మాటలు చాలా హైలెట్గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: