టీవీ: నటి నవ్య స్వామి షాకింగ్ పోస్ట్ వైరల్..!!

frame టీవీ: నటి నవ్య స్వామి షాకింగ్ పోస్ట్ వైరల్..!!

Divya
టాలీవుడ్ లో బుల్లితెరపై ఒక వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ నవ్య స్వామి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఇక నవ్య స్వామి నటనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నదని చెప్పవచ్చు. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది. కన్నడ సీరియల్స్ తో మొదటగా బుల్లితెరకు పరిచయమైన నవ్య స్వామి ఆ తర్వాత తమిళంలో కూడా పలు నాటికలలో నటించింది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం నా పేరు మీనాక్షి వంటి సీరియల్ తో పరిచయమయ్యింది. దీంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమవుతున్న ఆమె కథ వంటి నాటికలో కూడా నటిస్తున్నది.
ఈ సీరియల్ అతి తక్కువ సమయంలోనే పూర్తి అయ్యింది. ఇటీవల నా పేరు మీనాక్షి సీరియల్ కూడా శుభం కార్డు పలికింది . ఇక ఆమె కథ సీరియల్ నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ రవి కృష్ణ తో బాగా క్లోజ్ గా ఉండడం జరుగుతుంది. గతంలో కూడా వీరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లుగా బాగా వార్తలు వినిపించాయి. కానీ వాళ్ళు ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు వారిద్దరి మధ్య ఏమీ లేదని అవన్నీ ఒట్టి పుకార్లే అన్నట్టుగా తెలియజేశారు.
కానీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఈవెంట్లో షో లలో బాగా సందడి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా చూడడానికి ఎంతో సన్నిహితంగా ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. ఇలా తన కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక వీరిద్దరి మధ్య ఎన్నో గాసిప్స్ వచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరూ కలిసిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక షాకింగ్ స్టోరీ ని తెలియజేసింది. అదేమిటంటే తను రెండు విధాలుగా ఉంటానని అదేంటంటే తన గురించి ఒకరు పట్టించుకున్నప్పుడు ఒకలాగా ఉంటాను పట్టించుకోకున్నప్పుడు మరొక లాగా ఉంటానని కామెంట్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: