టీవీ: తనకు మాత్రం తనే ఇష్టపడుతున్న టిక్ టాక్ వైష్ణవి..!!

Divya
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా మంచి వేదికగా మారుతోంది. ముఖ్యంగా నటీనటులు కావడానికి కూడా సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతోంది అని చెప్పవచ్చు. ఈ సోషల్ మీడియా ద్వారా తమ లో ఉన్న టాలెంట్ ని ప్రతి ఒక్కరు కూడా బయటపెట్టి బుల్లితెరపై వెండితెర పైన బాగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్ స్టార్లు సైతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు మెండుగా సంపాదిస్తున్నారు. అందులో ముఖ్యంగా షణ్ముక్, దీప్తిసునయన, దీపికా పిల్లి వంటి వారు ఉన్నారు.

యూట్యూబ్ స్టార్లు బుల్లితెరపై, వెండితెర పై పలు అవకాశాలను కూడా అందుకుంటున్నారు. ఇక వీరే కాకుండా మరో సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య కూడా మంచి సెలబ్రిటీ అని చెప్పవచ్చు. మొత్తానికి సోషల్ మీడియా ద్వారా ఒక సెలబ్రిటీ గా మారిన ఈమె అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించినది. మొదట డమ్స్మ్యాష్ వీడియోల ద్వారా బాగా పరిచయం అయ్యింది. ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలు బాగా ఆకట్టుకుంది. అలా అలా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవి యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిం లలో కూడా నటించింది.
యూట్యూబ్లో కూడా మంచి సక్సెస్ కావడంతో ఇక మోడల్ గా మంచి క్రేజ్ అందుకున్నది. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు అవకాశాలను అందుకున్నది. అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ సోదరిగా నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. ఇక ఈమె ఎక్కువగా సాఫ్ట్వేర్ డెవలపర్ అని వెబ్ సిరీస్ తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. అందులో షణ్ముఖ్ జస్వంత్ కూడా నటించారు. ఇక ఈమెకు యూట్యూబ్ లో కూడా 400k సబ్స్క్రైబ్ ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో 700k ఫాలోవర్స్ కలిగి ఉన్నది. వైష్ణవి ఎక్కువగా ఇంట్లో కంటే నెట్టింట్లో బాగా యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. అలా అలా వైష్ణవి ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని తెలియజేసింది. అలా వైకుంఠపురం సినిమాలో మీరంటే చాలా ఇష్టం అని అనడంతో వెంటనే వైష్ణవి థ్యాంక్యూ అంటూ తనకు కొరియోగ్రాఫర్ విజయ్ అంటే ఇష్టం అని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: