టీవీ: పబ్ కి వెళ్లి లక్షల రూపాయలు పోగొట్టుకున్న నటి..!!
అసలు విషయంలోకి వెళితే స్నేహితులతో కలిసి పబ్బుకి వెళ్లిన ఒక నటి తన మొబైల్ను పోగొట్టుకున్నట్టు గా తెలుస్తోంది. అయితే వాటి విలువ దాదాపుగా లక్ష రూపాయలు కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే బాలీవుడ్ కి చెందిన ఒక నటి సింగర్ గరిమా జైన్.. తన స్నేహితులతో కలిసి ఏప్రిల్ 2న ముంబైలో ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న ఒక పబ్ లోకి వెళ్ళిందట. అయితే పార్టీ అయిపోయిన తర్వాత ఉదయం..3:15 నిమిషాల సమయంలో అందరూ ఇంటికి బయలుదేరారు అట అలాంటి సమయంలో తన స్నేహితులకు ఫోన్ చేయడానికి ఫోన్ కోసం వెతకడం తో ఆమె దగ్గర మొబైల్ దొరకలేదట.
దాంతో ఆమె ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోందట. తన మొబైల్ ఖరీదు లక్ష రూపాయలు కావడంతో ఆమె తీవ్ర ఆందోళనకు చెందుతూ పబ్బు నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది గారిమా జైన్. ఇక ఇదే విషయంపై కూడా ఈమె ఎయిర్పోర్ట్ పోలీసులకు కూడా తన ఫిర్యాదును నమోదు చేసింది. అలాగే పబ్ లో పని చేసే వ్యక్తుల పైన కూడా ఈమె పోలీసులు కేసు పెట్టడంతో వారిని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈమె మొబైల్ వెతుకులాటలో ఉన్నారు పోలీసులు.