టీవీ: రంగుల రాట్నం సీరియల్ హీరోయిన్ రియల్ లైఫ్ స్టోరీ..!!

Divya
ప్రతిరోజు సాయంత్రం 6:00 గంటల అయిందంటే చాలు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ సీరియల్స్ కోసం టీవీ ముందు వాలిపోతున్నారు. ఈ క్రమంలోని ఈటీవీ లో ఎన్నో సీరియల్స్ ప్రసారం అవుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడమే కాకుండా ఆతృతను, ఆనందాన్ని కలుగ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రసారమవుతున్న రంగుల రాట్నం సీరియల్ డిసెంబర్ నెలలో మొదలయ్యి నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సీరియల్ లో ఉన్న ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తూ.. ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా కొనసాగిస్తున్నారు దర్శకులు. ఈ క్రమంలోనే ఈ సీరియల్ హీరోయిన్ గా నటిస్తున్న సీతామహాలక్ష్మి రియల్ లైఫ్ గురించి ఒకసారి తెలుసుకుందాం.
రంగులరాట్నం సీరియల్ ప్రారంభమైన అతి తక్కువ రోజుల్లోనే ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ కొనసాగుతోంది. ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న మహాలక్ష్మి తన అందంతో , నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకోవడమే కాకుండా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహాలక్ష్మి అసలు పేరు మాహి గౌతమి.. నవంబర్ 21వ తేదీన గౌతమి హైదరాబాద్ లో జన్మించింది. గౌతమి కి ఇద్దరు సోదరులు కూడా వున్నారు. ఇక ఈమె చదువు విషయానికొస్తే.. బీటెక్ లో ఈసీఈ పూర్తి చేసింది.
మాహి గౌతమికి చిన్నప్పటినుంచి నటన రంగంపై ఇష్టం ఉండడం కారణంగా స్కూల్ అలాగే కాలేజీ లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్ లో  చాలా హుషారుగా పాల్గొంటూ ఎన్నో బహుమతులు సైతం గెలుచుకుంది. చదువు పూర్తి కాగానే యాంకర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది మాహి గౌతమి. వనిత టీవీ లో యాంకర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన ఈమె ఆర్ జే గా కూడా పనిచేసింది. లేట్ నైట్ అనే షార్ట్ ఫిలిం లో కూడా ఈమె నటించింది. బుల్లితెరపై నటించాలన్న ఆసక్తి తోనే స్టార్ మా లో ప్రసారం అవుతున్న నీవల్లే నీవల్లే అనే సీరియల్ ద్వారా నటిగా ప్రయాణం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ టీవీ లో ప్రసారం అవుతున్న రంగులరాట్నం.. జీ తెలుగులో ప్రసారం అవుతున్న అగ్నిపరీక్ష సీరియల్ లో కూడా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: