టీవీ:రష్మి సుదీర్ లేకుంటే.. మల్లెమాల పరిస్థితి అంతేనా..?

Divya
ఈ టీవీ షోలో మల్లెమాల సంస్థ.. ఎన్నో ప్రోగ్రామ్ లను చేస్తూ ఉన్నది. అలాంటి వాటిలో ఢీ కూడా ఒకటి. ఇందులో కంటెస్టెంట్లు గా ఎంతోమంది మారినప్పటికీ సుధీర్ , రష్మీ దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉండేవారు.. అయితే ప్రస్తుతం వస్తున్న ఢీ -14 గత వారం లో ప్రారంభమైంది.. ఇందులో రష్మీ ని సుధీర్ ని తప్పించడం కూడా జరిగింది. ఇక ఇందులో యాంకర్ ప్రదీప్ తో పాటుగా.. బిగ్ బాస్ అఖిల్ సార్ధక్, సుష్మిత, హైపర్ ఆది.. మిగతా వారు కూడా ఉన్నారు. అయితే ఇందులో జడ్జీలుగా మాత్రం ప్రియమణి, నందిత శ్వేత జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.
అయితే తాజాగా వీరందరూ ఎంత మంది ఉన్నప్పటికీ టిఆర్పి రేటింగ్ మాత్రం చాలా డల్ గా ఉందన్నట్లుగా సమాచారం. ఇక వీరందరూ కలసి రష్మీ , సుధీర్ లేకుండా ఈ షో ని ఎలాగైనా నడిపించాలనుకున్నారు.అయితే ఈ షో కి కేవలం 3.5 రేటింగు మాత్రమే సాధించారు. వాస్తవానికి ఈ డాన్స్ షో లో పర్ఫార్మెన్స్ అదిరిపోయింది అని చెప్పవచ్చు.. కానీ ఎంత టైమ్ ఎంత ఫన్ అందించడంలో రష్మీ సుధీర్ లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటూ కొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక దాని ప్రభావం టిఆర్పి రేటింగ్ మీద కూడా పడినట్టు సమాచారం.
పూర్ణ స్థానంలో నందిత శ్వేతా ను తీసుకు వచ్చిన.. ఇక రష్మీ సుధీర్ తో పాటు పూర్ణ కూడా కాస్త స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేది.. సుధీర్ స్థానంలోకి అఖిల్ వచ్చినప్పటికీ ఆ ప్లేస్ ని భర్తీ చేయలేకపోయాడు అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మిగిలిన వారందరూ ఎలాగోలా పులిహోర కలుపుతున్న వినోదాన్ని మాత్రం పంచలేక పోతున్నారు. అయితే సుధీర్.. రష్మి స్థానాన్ని నైనిక, డాన్సర్ సాయి తో కలిసి భర్తీ చేయాలని చూశారు.. కానీ అది కూడా పెద్దగా వర్కవుట్ అయినట్టు కనిపించడం లేదు. సుధీర్ , రష్మీ లేకపోతే ఇంతే మరి అంటున్నారు  నెటిజన్లు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: