టీవీ: నా పేరు మీనాక్షి సీరియల్ ఫేమ్ జాను గురించి తెలుసా..?

Divya
టీవీ సీరియల్స్ లో తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్న పలు సీరియల్స్ లో నా పేరు మీనాక్షి సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ లో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నవ్య స్వామి లీడ్ రోల్ చేస్తోంది.. ఇక ఇందులో విలన్ పాత్రలో దీపిక అగర్వాల్ పేరుతో వాణి పొన్నప్ప నటన కూడా చాలా అద్భుతం అని చెప్పవచ్చు. ఇక పలు రకాల పాత్రలలో ఎంతోమంది నటీనటులు ఈ సీరియల్ లో నటిస్తూ తెలుగు ఈ టీవీ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బిజినెస్ మాగ్నెట్ డాటర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జాను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజం చెప్పాలంటే ఈ సీరియల్ మొత్తం జాను ప్రేమ, పెళ్లి అనే కథ చుట్టూనే తిరుగుతుంది.. ఇంతటి మెయిన్ రోల్ చేస్తున్న జాను గురించి మనం ఆమె వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకుందాం..

జాను అసలు పేరు రసజ్ఞా రెడ్డి.. రసజ్ఞా ను రీతు అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఈమె బుల్లితెరపై అడుగులు వేసి  తన అందం, అభినయంతో అతి తక్కువ సమయంలోనే మంచి ప్రేక్షకాదరణ కూడా పొందుతోంది. నవంబర్ 10వ తేదీన జన్మించిన ఈమె చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకుంది.. ఈ నేపథ్యంలో ని తన చదువు పూర్తి చేసుకున్న తర్వాత మోడల్ గా రసజ్ఞా రెడ్డి తన కెరియర్ ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ లతోపాటు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. మహానటి, రౌడీ బేబీ, ఇద్దరి మధ్య లో ఏం జరిగింది, మై డాడీ ఇస్ మై హీరో.. నాటకం, నిజం తెలుసుకోవాలంటే, కథనం ,బావమరదళ్ళు లాంటి పలు షార్ట్ ఫిలిమ్స్ లో రసజ్ఞ నటించింది.

ఆడదే ఆధారం సీరియల్ తో ఈమె బుల్లితెరపై అడుగుపెట్టి, ఆ తర్వాత ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన మజిలీ సీరియల్ లో నటించింది. రసజ్ఞా ఒక నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా. ప్రస్తుతం ఈటీవీలో నా పేరు మీనాక్షి అనే సీరియల్లో జాను పాత్రలో నటిస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: