టీవీ: సుమ-రాజీవ్ కనకాల మీద విరుచుకుపడ్డ అన్నపూర్ణ .. కారణం అదేనా !

Divya

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ అన్నపూర్ణ గురించి అందరికీ సుపరిచితమే. ఈమె ఎన్నో సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె సినీ ఇండస్ట్రీలో ఉన్న వారి మీద.. ఎవరి మీదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంది. ఇక అంతే కాకుండా ఈమె కొంత మంది హీరోలతో, దర్శకులతో సినిమాలు చెయ్యను  అని తెలిపింది, కారణం వారితో మనస్పర్ధలు ఏర్పడడం వల్ల  అని తెలిపింది.
ఇకపోతే సినీ ఇండస్ట్రీలో బాగా గుర్తింపు రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల. ఈమెను  ఒక భూమి విషయంలో దేవదాస్ కనకాల చేతులో మోసపోయానని తెలిపింది. ఆయన చనిపోయిన తర్వాత పలుసార్లు తన కొడుకు అయినటువంటి రాజీవ్ కనకాలకి చాలాసార్లు తెలిపానని, తను ఆ విషయం పై ఏమీ మాట్లాడలేదు అని కూడా తెలిపింది అన్నపూర్ణమ్మ.

తన కొడుక్కి తెలియకుండా దేవదాస్ కనకాల ఏమి చేయడని, తను సంపాదించే ప్రతి రూపాయి తన కొడుక్కి ఇస్తారు కదా... గతంలో ఒకసారి ఈ విషయంపై గొడవ జరిగినప్పుడు, ఈయన కూడా పక్కనే ఉన్నారని తెలిపింది. ఇక అంతే కాకుండా ఈ విషయంపై రాజీవ్ కనకాల ఫోన్ చేస్తే తను నా నెంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టారు అని కూడా తెలిపింది.
అయినా ఈ విషయంలో నాదే తప్పు లేండి.. ఎందుకంటే ఎవరో చెప్పారని ఏమి ఆలోచించకుండా.
 భూమి కొనడం నాదే తప్పు. అని చెప్పుకొచ్చింది అన్నపూర్ణమ్మ. ఈ భూమిని దేవదాస్ కనకాల 22 సంవత్సరాల క్రితమే కొన్నారని తెలిపింది. కానీ ఈ భూమిని వాళ్ళు వెంచర్ వేసి ఇతరులకు ఆమ్మేశారు. ఈ భూమి నాకు అమ్మిన విషయం వారి ఇంట్లో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎవరికీ తెలియదని చెప్పడం నాకు బాధ వేసింది అని తెలిపింది.
వారేం..ఈ భూమిని అంటిపెట్టుకుని ఉంటారా.. పోయేటప్పుడు ఏమి పట్టుకొని పోము.. అందరము అక్కడికి పోయే వాళ్ళమే.." చెప్పుకొచ్చింది. ఎప్పటికైనా నా గోడుని,  అర్థం చేసుకొని, నా భూమి నాకు తిరిగి ఇస్తారని ఆశిస్తున్నాను అంటూ అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: