రాధికా పై పైచేయి సాధించిన వరలక్ష్మి..ఏకంగా ఆ సీరియల్ కె ఎసరు పెట్టింది గా

Mamatha Reddy
ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించిన రాధిక చిరంజీవి తో చాలా సినిమాలు చేసింది.అలాగే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసింది రవితేజ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాలు రవితేజ అమ్మ గా నటించి మంచి పేరు సంపాదించారు. అప్పట్లోనే హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో
బుల్లితెరపై సీరియల్స్ నీ చేయడం స్టార్ట్ చేశారు ఒకప్పుడు ఈటీవీ లో ఇది కథ కాదు అనే సీరియల్ లో చేశారు ఆ తర్వాత జెమినీ టీవీలో వచ్చే పిన్ని సీరియల్లో నటించారు. ఆ సీరియల్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం పిన్ని సీరియల్ కి సీక్వెల్ గా పిన్ని 2 వస్తుంది. బాగానే రన్ అవుతున్న సీరియల్ లో అనుకోకుండా ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ సీరియల్ నుంచి అనేక మంది నటులు తప్పుకున్నారు. వారి స్థానంలో కొత్త వాళ్లు వచ్చారు. దీంతో అసలు పిన్ని 2 సీరియల్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థంకాలేదు. ఇక ఈ సీరియల్ నుంచి తాను కూడా తప్పుకుంటున్నట్టు రాధిక కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. రాధిక ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించగానే.. ఆమె స్థానంలోకి ఎవరు వస్తారనే దానిపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. సీనియర్ నటి రమ్యకృష్ణ ప్లేస్‌లోకి వస్తారనే ప్రచారం కూడా సాగింది.
అయితే తాజాగా రాధిక స్థానంలోకి ఆమె కూతురు రాబోతోందనే టాక్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రాధిక స్థానంలో పిన్ని 2 లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే దీనిపై వరలక్ష్మీని స్పందిస్తే మాత్రం.. ఈ వార్తల్లో నిజం లేదని ఆమె వెల్లడించింది. ఇక కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీకి ఆ తరువాత అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఈ అందాల భామ విలన్‌గా మారిపోయింది. ఇటీవల తెలుగులో ఆమె నటించిన క్రాక్ మూవీ సక్సెస్ కావడంతో వరలక్ష్మీకి కూడా మంచి పేరు వచ్చింది. దాంతో తెలుగులో కూడా వరలక్ష్మికి వరుస ఆఫర్లు వస్తున్నాయి అల్లరి నరేష్ హీరోగా  ఈ మధ్య రిలీజ్ అయిన నాంది సినిమా లో మంచి క్యారెక్టర్ చేశారు ఆ సినిమా కూడా హిట్ అవడంతో ప్రస్తుతం తెలుగులో తనకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి.
మరోవైపు అసలు ఈ సీరియల్ నుంచి రాధిక ఎందుకు తప్పుకుందనే దానిపై కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టైమ్ స్లాట్ విషయంలో సన్ టీవీ యాజమాన్యంతో రాధికకు మనస్పర్థలు వచ్చాయని.. ఈ క్రమంలోనే ఆమె తప్పుకున్నాని ప్రచారం జరుగుతోంది. అలాంటివేమీ లేవని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాధిక పోటీ చేయబోతున్నారని.. రాజకీయంగా బిజీగా కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. రాధిక ఎందుకు తప్పుకుందో తెలియదు గాని ఆమె తప్పుకోవడం వల్ల సీరియల్ కి ఉన్న క్రేజ్ తగ్గిపోయే అవకాశం ఉంది. అలా సీరియల్ క్రేజ్ తగ్గిపోకుండా ఉండాలంటే ఆమె లాగ బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న నటిని ఆమె క్యారెక్టర్ కి తీసుకోవాలి లేకపోతే పిన్ని 2 సీరియల్ ని చూసేవాళ్ల సంఖ్య తగ్గిపోతుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: