ఇండియాలో అతి పెద్ద టు వీలర్ కంపెనీగా ప్రసిద్ధి చెందిన హీరో మోటోకార్ప్ 'జూమ్' (Xoom) ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది.కంపెనీ విడుదల చేసిన ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్, ఫీచర్స్ ఇంకా డిజైన్ వంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇండియన్ మార్కెట్లో విడుదలైన హీరో జూమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి ఎల్ఎక్స్ (LX), విఎక్స్ (VX) ఇంకా జెడ్ఎక్స్ (ZX) వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 68,599, రూ. 68,599 ఇంకా రూ. 71,799 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్స్ ఫిబ్రవరి 01 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది.ఈ కొత్త హీరో జూమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన డిజైన్ ని కలిగి ఉంటుంది. ఇందులో విశాలంగా ఉన్న సీటు రైడర్ ఇంకా అలాగే పిలియన్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. దీని భాగంలో హెచ్ షేప్ లో ఉండే టైల్లైట్ ఇంకా అలాగే ముందు భాగంలో ప్రకాశవంతమైన లైటింగ్ సెటప్ అనేది ఉంటుంది.
ఈ స్కూటర్ మొత్తం 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ని కూడా పొందుతుంది. మొత్తం మీద ఈ బైక్ డిజైన్ చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది.ఇక ఈ స్కూటర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఉంటుంది. ఇది కాలర్ ID, ఇన్కమింగ్ కాల్స్ ఇంకా SMS, మిస్డ్ కాల్లు ఇంకా అలాగే ఫోన్ బ్యాటరీ లెవెల్ వంటి వాటిని రైడర్ కి తెలియజేస్తుంది. ఇక అంతే కాకుండా ఇందులో USB ఛార్జర్, గ్లోవ్ బాక్స్ ఇంకా బూట్ లైట్ వంటివి కూడా ఇందులో ఉంటాయి. ఈ ఫీచర్ లు అన్నీ కూడా వాహన వినియోగదారులకు ఎంతో అనుకూలంగా ఉంటాయి.ఈ హీరో జూమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 110 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. అందువల్ల ఇది 7,250 ఆర్పిఎమ్ వద్ద 8.05 బిహెచ్పి పవర్ ఇంకా 5,750 ఆర్పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఇంజిన్ i3S ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ సామర్థ్యాన్ని బాగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇంకా అంతే కాకూండా ఇది CVT గేర్బాక్స్ పొందుతుంది.