బుల్లి పిట్ట: అక్టోబర్ నుంచి ఆ మొబైల్స్ లో వాట్సప్ బంద్..!!

Divya
వాట్సప్ ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన వాటిలో వాట్స్అప్ కూడా ఒకటి అని చెప్పవచ్చు.. ఎందుచేత అంటే మనం ఏదైనా విషయాన్ని పంపించాలి అన్న షేర్ చేయాలని ఎక్కువగా ఉపయోగించేది వీటినే. ఈ వాట్స్అప్ ఎలాంటి వ్యక్తులకైనా సరే సులువుగా అర్థమవుతుంది. అందుచేతనే వాట్సప్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక వాట్సప్ సంస్థ కూడా రకరకాల ఫ్యూచర్ లను అప్డేట్లను తీసుకువస్తూ ఉన్నది యూజర్ల కోసం. ఈ నేపథ్యంలో అప్ గ్రేడ్ చేసిన సాఫ్ట్వేర్లకు అనుగుణంగా ఆపరేటింగ్ సిస్టం ఉంటేనే ఈ యాప్ ఆ మొబైల్స్ లో వర్క్ చేస్తుందట.

లేకపోతే ఆ మొబైల్లో వాట్సప్ సేవలను బంద్ చేయనున్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా పలు పాత మొబైల్స్ లో కూడా వాట్సాప్ సేవలను నిలిపివేయునున్నట్లు అధికారికంగా ప్రకటించింది వాట్సాప్ సంస్థ. అక్టోబర్ నెల నుంచి కొన్ని మొబైల్స్ లో  వాట్సప్ సేవలు నిలిచిపోనున్నట్లు సమాచారం. డబ్ల్యూ ఏ బేటా ఇన్ఫో ప్రకారం.. వాట్సప్ అక్టోబర్ నుంచి ఐ ఓ ఎస్ 10, ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే మొబైల్స్ లో పనిచేయదట. ఈ మేరకు ఈ ఆపరేటింగ్ సిస్టములు ఉపయోగిస్తున్న వారికి అందుకు సంబంధించి అలెర్ట్ ను కూడా జారీ చేసినట్లు సమాచారం.
వాట్సప్ సేవలను కొనసాగించాలి అంటే వారి యొక్క ఆపరేటింగ్ సిస్టములను అప్డేట్ చేసుకోవాలని యాపిల్ సంస్థ సూచిస్తున్నది ఐవోఎస్ 12 లేదా తర్వాత ఆపరేటింగ్ సిస్టంకు సపోర్ట్ చేసి మొబైల్స్ లోని ఈ వాట్స్అప్ పనిచేస్తుందని తెలియజేశారు. అయితే ముఖ్యంగా iphone -5, iphone 5c అనే రెండు మొబైల్స్ లో మాత్రమే ప్రభావితం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఐఫోన్ ను అప్గ్రేటింగ్ చేసుకోవాలనుకునేవారు సెట్టింగ్ లోకి వెళ్లి అక్కడ జనరల్ ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ ను సెలెక్ట్ చేసుకుని అక్కడ తాజా ఐఓఎస్ వెర్షన్ గల వాటిని ఎంచుకుంటే సరిపోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: