ఈ టెక్నాలజీతో 15 నిమిషాల్లోనే హైదరాబాద్ టు విజయవాడ వెళ్లొచ్చు!

ఇప్పుడు మనం రోడ్డు, రైలు, వాయు ఇంకా సముద్ర మార్గాల ద్వారా ప్రయాణాలు చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఆ సమయాన్ని కూడా తగ్గించేందుకు సరికొత్త టెక్నాలజీలను సృష్టిస్తున్నారు. అలాంటి టెక్నాలజీనే ఈ హైపర్‌లూప్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీతో చెన్నై నుంచి బెంగళూరుకు అంటే 350 కిమీ దూరాన్ని కేవలం 25 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.ఇక ఈ హైపర్‌లూప్ టెక్నాలజీపై చెన్నై ఐఐటీ విద్యార్థులు అధ్యయనం చేస్తున్నారు. ఈ టెక్నాలజీ కార్యరూపంలోకి వస్తే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించొచ్చని పేర్కొన్నారు.ఇక ఈ హైపర్ లూప్ ఐడియాను టెస్లా సీఈఓ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ముందుగా చెప్పారు. ఈ టెక్నాలజీతో ప్రయాణ సమయాన్ని ఈజీగా తగ్గించొచ్చన్నారు. సాధారణంగా ఓ వాహన వేగం అనేది ఘర్షణ ఇంకా ఎయిర్‌ రెసిస్టెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.ఇక వేగాన్ని నియంత్రించే ఈ ఫ్రిక్షన్ ఇంకా ఎయిర్‌ రెసిస్టెన్స్‌ను హైపర్‌లూప్ టెక్నాలజీ వినియోగించి అధిగమించొచ్చు. ఈ టెక్నాలజీ సహాయంతో చెన్నై నుంచి బెంగళూరు ప్రయాణించాలంటే రెండు నగరాల మధ్య ఓ భారీ పైప్‌లైన్‌ అనేది ఏర్పాటు చేయాలి.


ఇక ఆ తర్వాత ఇందులోకి గాలిని పంపించి వాక్యూమ్‌ను సృష్టిస్తారు. అలాగే ఆ తర్వాత పాసింజర్ పాడ్ (ప్రయాణికులు కూర్చొనే వీలుగా ఉండే )ను ఆ ట్యూబ్‌కు అటాచ్ చేస్తారట.ఆ తర్వాత ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌ను అయస్కాంత క్షేత్ర విక్షేపం (మేగ్నెటిక్ ఫీల్డ్ డిఫ్లెక్షన్) తో ప్రయాణించేలా చేస్తారు. అమెరికా, బ్రిటన్ ఇంకా అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు భవిష్యత్తులో ఈ టెక్నాలజీని కార్యరూపంలోకి తెచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాయి.ఇక ఈ హైపర్‌లూప్ టెక్నాలజీ సాయంతో ఓ వాహనాన్ని 100 మీటర్లు నడిపించి చెన్నై ఐఐటీ విద్యార్థులు ఎన్నో అవార్డులు కూడా పొందారు. త్వరలోనే 500 మీటర్ల పాటు ప్రయాణించేలా వారు ప్లాన్ చేస్తున్నారు. ఇది కనుక విజయవంతమైతే భారత ప్రయాణ చరిత్రలో ఇది మరో రికార్డ్ సృష్టించినట్లే.ఇక ఈ హైపర్‌లూప్ వాహనం గంటకు 1,223 కిమీ వేగంతో ప్రయాణం చేయగలదట. అంటే చెన్నై నుంచి ముంబయికి కేవలం గంటలోనే వెళ్లిపోవచ్చు. అదే చెన్నై నుంచి బెంగళూరు వెళ్లాలంటే కేవలం 25 నిమిషాలు సరిపోతుంది. అదే మన హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్లాలంటే కేవలం 15 నిమిషాలు సరిపోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: