కోహ్లీ గురించి ఇది నమ్మలేని నిజం.. విరాట్ ఆయన కెప్టెన్సీలో కూడా ఆడాడట?

praveen
టీమిండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఇండియన్ క్రికెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్లోనూ కోహ్లీకి ప్రత్యేకమైన స్థానం. సాదాసీదా క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ఎంతోమంది స్టార్ ప్లేయర్లు కూడా విరాట్ కోహ్లీ ఆటకు అభిమానులుగా ఉంటారు అని చెప్పాలి.

 అద్భుతమైన ఆటతీరుతో ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను బద్దలు కొట్టి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ చేత రికార్డుల రారాజు అని పిలిపించుకుంటున్నాడు విరాట్ కోహ్లీ. ఇక ఇప్పటికీ కూడా మూడు ఫార్మట్లలో రాణిస్తూన్న కోహ్లీకి సోషల్ మీడియాలో కూడా  మంచి క్రేజ్. అయితే కోహ్లీ గురించి ఏ చిన్న విషయం తెర మీదకి వచ్చినా కూడా అది హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇక ఇప్పుడు కోహ్లీ అభిమానులు సైతం నమ్మలేని ఒక షాకింగ్ విషయం ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ చర్చనీయాంశంగా  మారింది.

 టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గతంలో తన కెప్టెన్సీలో ఆడాడు అంటూ తేజస్వి యాదవ్ గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ మాత్రమే కాదు ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఎంతో మంది స్టార్స్ నా బ్యాచ్ మేట్స్ అంటూ తెలిపాడు. ఈ విషయం ఎవరికైనా తెలుసా.. ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ గా నేను ఉత్తమంగా ఆడాను. నా కాళ్ళ లింగ్మెంట్ లు దెబ్బతినడం వల్ల నేను క్రికెట్ వదిలేయాల్సి వచ్చింది అంటూ తేజస్వి యాదవ్ చెప్పుకొచ్చాడు. కాగా తేజస్వి యాదవ్ ఢిల్లీ రాష్ట్ర జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. అండర్ 15, అండర్ 19 జట్టులో తేజశ్రీ విరాట్ కోహ్లీ తో కలిసి ఆడాడట. ఆ సమయంలో తేజస్వి ఢిల్లీ టీం కెప్టెన్ గా ఉన్నాడు. 2008లో ఐపిఎల్ లో కూడా ఆడాడు. కానీ 2010లో రెండు కాళ్ల లింగ్మెంట్లు దెబ్బ తినడంతో రాజకీయాల్లోకి ప్రవేశించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: