హర్ష భోగ్లె ఐపీఎల్ ఆల్ టైం ఎలెవన్ జట్టు.. ఇంతకీ కెప్టెన్ ఎవరో తెలుసా?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి అటు వరల్డ్ క్రికెట్లో ఏ రేంజ్ లో క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సాదాసీదా టీ20 టోర్నీగా ప్రారంభమైన ఐపిఎల్ ఇక ఇప్పుడు వరల్డ్ లోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతోంది. అయితే ఈ లీగ్ కి ఉన్న పాపులారిటీ దృశ్య ఇక ప్రపంచంలోనే ప్రతి ఆటగాడు కూడా ఈ టోర్నీలో భాగం కావాలని ఆశ పడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇందుకోసం ఏకంగా దేశం తరపున ఆడే మ్యాచ్లను సైతం వదులుకునేందుకు సిద్ధమవుతూ ఉండడం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నామ్.

 ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఎంతోమంది ఆటగాళ్లు ఎన్నో ఏళ్ల పాటు వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించి తమ ఆట తీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారు ఉన్నారు. అంతేకాదు ఎన్నో అరుదైన రికార్డులు కూడా క్రియేట్ చేసి ఐపీఎల్ లెజెండ్స్ గా ఎదిగిన వారు కూడా ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడూ వాళ్ళు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయా ఆటగాళ్లు ఐపిఎల్ లో ఆడిన ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ల గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ఇండియాలో 2025 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన హడావిడి నడుస్తూ ఉంది.

 ఇలాంటి సమయంలో ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు ఐపీఎల్ హిస్టరీలో తమ ఆల్ టైం ఫేవరెట్ ఎలెవన్ జట్టు ఏది అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఉండడం ట్రెండ్ గా మారింది. ఈ క్రమంలోనే ప్రముఖ కామంటేటర్ హర్ష భోగ్లే తన ఆల్ టైం ఐపీఎల్ ప్లేయింగ్ జట్టును ప్రకటించాడు. ఇందులో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, మ్యాక్స్ వెల్, పొలార్డ్ వంటి ప్లేయర్లకు చోటు ఇవ్వలేదు. కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనిని ఎంపిక చేశాడు హర్ష భోగ్లే. అయితే ఐదు సార్లు ముంబైకి టైటిల్స్ అందించి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా కొనసాగిన రోహిత్ ను పక్కన పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: