అయ్యయ్యో.. ఆసియా కప్ శ్రీలంకకు అప్పజెప్పిన భారత్!

praveen


మహిళల ఆసియా కప్ 24 విజేతగా శ్రీలంక మహిళల జట్టు రికార్డు సృష్టించింది. వరుస విజయాలతో భారత్ మహిళల జట్టు నెట్టుకొచ్చినా డంబుల్లా, భారత్ లో జరిగిన ఫైనల్ లో మాత్రం చతికల పడింది. 166 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన శ్రీలంక మహిళలు జట్టు ఇంకా ఎనిమిది బంతులో పెండింగ్ ఉండగానే రెండు వికెట్లు నష్టంతో టార్గెట్ ని రీచ్ అయింది.

ఈ క్రమంలో టాస్ భారత్ మహిళల జట్టు గెలుచుకొని.. బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట చాలా హుషారుగా మొదలైన మహిళల బ్యాటింగ్ క్రమేపి నెమ్మదించడంతో టార్గెట్ సంఖ్య తక్కువ కాబడింది. ఈ నేపథ్యంలో భారత్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లకి గాను, 165 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ సంఖ్య కూడా అంత తేలికగా కౌంట్ కాలేదు. మొత్తం భారత్ మహిళల జట్టు ఆరు వికెట్లను కోల్పోవలసి వచ్చింది. అయితే ఈ లక్ష్యాన్ని శ్రీలంక మహిళలు జట్టు ఇంకా ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించడం విశేషం అనే చెప్పుకోవాలి.

భారత్ మహిళల ఓపెనర్ బ్యాట్ విమెన్స్ అయినటువంటి స్మృతి మందాన.. 47 బంతులకు గాను 60 రన్స్ చేసి పెవెలియన్ చేరింది. ఇందులో 10 ఫోర్లు ఉన్నాయి. ఇక జెమిమా, 16 బంతులకి గాను కేవలం 29 పరుగులు కొట్టి వెనుదిరిగింది. ఆ లిస్టులో మూడు ఫోర్లు సింగిల్ సిక్స్ ఉండడం గమనార్హం. అదేవిధంగా రిచా ఘోష్ విషయానికొస్తే... ఈమె కూడా అంత దూకుడుని ప్రదర్శించకపోవడం దురదృష్టకరం. ఈమె 9 బంతుల్లో 23 పరుగులు మాత్రమే చేసి ఇక చేయలేను అని సరిపెట్టుకుంది. అందులో మూడు ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి. ఇక సపాలి వర్మ కేవలం 16 రన్స్ కొట్టి అవుట్ అయిపోయింది. ఇక కెప్టెన్ అయినటువంటి హర్మన్ ప్రీత్ కౌర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈమె కేవలం 11 రన్స్ మాత్రమే చేసింది.. అదే విధంగా ఉమా చత్రి 9 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. అదలా ఉంచితే... శ్రీలంక బౌలర్లు మాత్రం ఎన్నడూ లేనంతగా చెలరేగిపోయారు. కవిష 2 వికెట్స్, సచిని 1 వికెట్, చమరి 1 వికెట్, ప్రబోధని 1 వికెట్ సాధించి శ్రీలంక జట్టు విజయం సాధించడంలో కీలక పాత్రను పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: