బీసీసీఐలో మరో మార్పు.. NCA కు కొత్త హెడ్.. ఎవరంటే?

praveen
గత కొంతకాలం నుంచి అటు భారత క్రికెట్ నియంత్రణ మండలలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇక పొట్టి ఫార్మాట్లో భారత జట్టుకు కొత్త కెప్టెన్ ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో హార్దిక్ పాండ్యానే టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అవుతాడు అని అందరూ అనుకుంటున్న సమయంలో.. ఏకంగా సూర్య కుమార్ యాదవ్ కు సెలక్టర్లు కెప్టెన్సీ అవకాశం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.

 బావి కెప్టెన్ అనుకున్న హార్దిక్ పాండ్యాకు కనీసం వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. అదే సమయంలో ఇక కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి కాలం కూడా ముగియడంతో టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ను  భారత జట్టుకు కొత్త హెడ్ కోచ్ గా నియమించింది. ఇక మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయి కోచింగ్ సిబ్బంది ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఇకపోతే అటు ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ ఇప్పుడు కొత్త చైర్మన్ రాబోతున్నాడు అన్నది తెలుస్తోంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్గా టీమిండియా మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ కొనసాగుతున్నాడు.

 ఈ క్రమంలోనే టీమ్ ఇండియాకు అప్పుడప్పుడు తాత్కాలిక కోచ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు వివిఎస్ లక్ష్మణ్. అయితే మరో రెండు నెలల్లో అతని కాంట్రాక్టు కాలం పూర్తి కాబోతుంది. దీంతో నేషనల్ క్రికెట్ అకాడమీకి హెడ్గా టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ రాబోతున్నాడు అనేది తెలుస్తుంది. అయితే అతని ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మరో రెండు నెలల్లో లక్ష్మణ్ కాంట్రాక్టు పూర్తికానున్న నేపథ్యంలో ఇక ఆ స్థానంలో విక్రమ్ రాథోడ్ ను నియమించాలని బీసీసీఐ భావిస్తుందట. కాగా మరోసారి ఎన్ సీఏ బాధ్యతలు చేపట్టేందుకు లక్ష్మణ్ విముఖత చూపుతున్నట్లు సమాచారం. సన్ రైజర్స్ హైదరాబాద్ మెంటార్ గా ఉండేందుకు వివిఎస్ లక్ష్మణ్ ఆసక్తిని కనబరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nca

సంబంధిత వార్తలు: