సౌత్ ఆఫ్రికాను ఓడించాలంటే.. అదొక్కటే దారి : గంగూలీ

praveen
ఎన్నో రోజులుగా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అలరిస్తూ వచ్చిన టీ20 వరల్డ్  2024 ఎడిషన్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. కాగా మొన్నటికి మొన్న సెమీఫైనల్ మ్యాచ్లు జరగ్గా నేడు ఫైనల్ పోరు జరగబోతుంది. ఆఫ్గనిస్తాన్ ను ఓడించి సౌత్ ఆఫ్రికా ఫైనల్లో అడుగుపెడితే.. ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టును ఓడించి టీమిండియం ఫైనల్ పోరుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు టీమ్స్ కూడా ఒక్క ఓటమి లేకుండా ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో ప్రస్థానాన్ని కొనసాగించి ఫైనల్ వరకు చేరుకున్నాయి. ఇక ఇప్పుడు ఫైనల్ లో ఈ రెండు టీమ్స్ మధ్య ఎలాంటి ఫైట్ జరగబోతుంది అనే విషయంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి.

 అయితే ఎన్నో రోజుల నుంచి ఇలా ఫైనల్ వరకు చేరుకొని కప్పు మిస్ చేసుకుంటున్న టీమిండియా ఈసారి మాత్రం ఎలాంటి తప్పులు చేయకుండా వరల్డ్ కప్ టైటిల్ ఎగరేసుకుపోవాలని అనుకుంటుంది. ఇలాంటి సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కీలకమైన సలహా ఇచ్చాడు క్రికెట్ లెజెండ్ భారత మాజీ ఆటగాడు సౌరబ్ గంగూలీ. తుది పోరులో సఫారీలను చిత్తు చేయాలి అంటే దూకుడు మంత్రం పాటించాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ పై భారత జట్టు అద్భుతంగా ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ ఇండియాను ముందుకు నడిపించిన విధానం సూపర్.

 ఇక రోహిత్ శర్మ బ్యాటింగ్ అమోఘం. బ్రిలియంట్ ఇన్నింగ్స్ తో అలరించాడు. అయితే సౌత్ ఆఫ్రికా తో జరిగే ఫైనల్ ఫైట్ లోను అతను ఇలాగే ఆడతాడని ఆశిస్తున్న. తుది పోరులో భారత్ నెగ్గుతుందని నమ్ముతున్న. ఈ మ్యాచ్ లో మన ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడాలి. దేనికి భయపడకుండా ఫియర్లెస్ అప్రోచ్ తో ముందుకెళ్లాలి. అలా అయితేనే సౌత్ ఆఫ్రికాను ఓడించగలం అంటూ సౌరబ్ గంగూలీ భారత జట్టుకి ఒక సజెషన్ ఇచ్చాడు. కాగా నేడు సాయంత్రం 6 గంటలకు ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక బంతికి బ్యాట్ కి మధ్య హోరాహోరీ సమరం జరగడం ఖాయమని ఎంతో మంది విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. మరి ఈ ఫైనల్ విజేత ఎవరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: