IND vs PAK మ్యాచ్ .. ఫ్యాన్స్ కి బ్యా న్యూస్.. మ్యాచ్ రద్దయ్యే చాన్స్?

praveen
వరల్డ్ క్రికెట్లో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా హై వోల్టేజ్ మ్యాచ్ అని పిలుచుకునే మ్యాచ్ ఏది అంటే అందరూ ఏకతాటిగా చెప్పేస్తుంటారు అదేదో కాదు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అని. ఎందుకంటే ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా అది టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య కేవలం క్రికెట్లో మాత్రమే కాదు సరిహద్దుల వద్ద కూడా వైరం కొనసాగుతూ ఉంటుంది. అదే సమయంలో ఇక ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై కూడా నిషేధం కొనసాగుతుంది.

 దీంతో అన్ని దేశాల లాగా అటు ఈ రెండు దేశాలు.. ఒక దేశ పర్యటనకు మరో దేశం వెళ్లడం.. ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం అస్సలు జరగదు. ఎందుకంటే క్రికెట్ సంబంధాలపై నిషేధం ఉన్న నేపథ్యంలో కేవలం ఐసిసి టోర్నీలో మాత్రమే ఈ రెండు టీమ్స్ తలబడుతూ ఉంటాయి. ఇక ఎప్పుడో ఒకసారి జరిగే ఈ దాయాదుల పోరును చూసేందుకు రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ పోరులో భాగంగా ప్రేక్షకులందరూ ఎదురుచూసిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నేడే జరగబోతుంది. ఈ క్రమంలోనే ఈ దాయాదుల పోరును చూసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రజానీకం సిద్ధమైంది.

 న్యూయార్క్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అందింది. ఎందుకంటే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని ఆక్యు వెదర్ పేర్కొంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11గంటలకు అంటే ఇండియాలో రాత్రి 8:30 గంటలకు 51% వరకు వర్షం పడే అవకాశం ఉంది అంటూ తెలిపింది. అయితే ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల వరకు 45 నుంచి 50% వర్ష సూచన ఉండడంతో మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ తెలిపింది. అయితే వరుణుడు కరుణించి మ్యాచ్ రద్దు అవ్వకుండా ఉంటే బాగుండు అని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: