కోహ్లీని టార్గెట్ చేస్తూ.. రాయుడు సంచలన వ్యాఖ్యలు?
ఎంతోమంది లెజెండరీ క్రికెటర్ కెరియర్ కాలం మొత్తంలో సాధించిన అధికారులను ఎంతో అలవోకగా బద్దలు కొట్టి తన పేరును లికించుకున్నాడు విరాట్ కోహ్లీ. సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్లను సంపాదించుకోవడంలో తనను మించిన వాళ్లు లేరు అని ఇప్పటికే అందరికీ అర్థమయ్యేలా చేశాడు. అయితే అలాంటి విరాట్ కోహ్లీ గురించి ఏదైనా విషయం తెరమీదకి వచ్చింది అంటే చాలు అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే గత కొంతకాలం నుంచి విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు సోషల్ మీడియాలో వరస పోస్టులు పెడుతూ ఉండటం సంచలనంగా మారింది. అయితే కోహ్లీ పేరు ప్రస్తావించకపోయినా అంబటి రాయుడు పెడుతున్న పోస్టులు చూస్తూ ఉంటే కోహ్లీని టార్గెట్ చేశాడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
ఇకపోతే ఇటీవలే మరోసారి అంబటి రాయుడు అటు విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే ఆరెంజ్ క్యాప్ ఉంటే సరిపోదు అంటూ అంబటి రాయుడు కామెంట్ చేశాడు. ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ ను విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో విరాట్ కోహ్లీని ఉద్దేశించి అంబటి రాయుడు ఈ కామెంట్స్ చేశాడు అని ఇక సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే ఇక ఆర్సిబి లోని యువ ఆటగాళ్లు బాగా ఆడాలంటే కోహ్లీ తన స్థాయిని తగ్గించుకొని ఆడితే బాగుంటుంది అంటూ మొన్నటికి మొన్న రాయుడు చేసిన కామెంట్స్ కూడా సంచలనంగా మారిపోయాయి.