ఐపీఎల్ : 2024 ఫైనల్స్ లో అందుకు సెలెక్ట్ అయిన ఒక్క ప్లేయర్ కూడా లేదు..!

Pulgam Srinivas
(ఐ పీ ఎల్ 2024) రసవత్తరంగా ముందుకు సాగుతోంది. ఈ సీజన్ లో కేవలం ఒకే మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వారే ఈ సారి టైటిల్ విజేత అవుతారు. రేపు అనగా మే 26 వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్రైజర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఈ ఇరు జట్ల అభిమానులతో పాటు మామూలు క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ప్రస్తుత సమీకరణాలను బట్టి చూస్తే ఈ రెండు జట్లు కూడా బలంగానే కనబడుతున్నాయి. ఏ జట్టు గెలవబోతోంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం కష్టంగానే కనబడుతుంది. దానితో రేపు జరగబోయే మ్యాచ్ ఉత్కంఠగా జరగబోతున్నట్లు అర్థం అవుతుంది. ఇది ఇలా ఉంటే (ఐ పీ ఎల్ 2024) కంప్లీట్ అయిన చాలా తక్కువ రోజుల్లోనే టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

దానితో (ఐ పీ ఎల్) సీజన్ ప్రారంభం అయినప్పటి నుండి ఎవరు అత్యున్నత ప్రదర్శనను కనబరిస్తారో అని జనాలు అంతా ఎంతో ఆత్రుతగా చూశారు. ఎందుకంటే ఇందులో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన వారు వరల్డ్ కప్ లో కూడా ఇచ్చే పర్ఫామెన్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఇక అసలు విషయం ఏమిటి అంటే రేపు ఫైనల్ ఆడబోతున్న కోల్కతా నైట్ రైడర్స్ , సన్రైజర్స్ రెండు జట్లలో కూడా టి 20 వరల్డ్ కప్ కు సెలక్ట్ అయిన ఒక్క ప్లేయర్ కూడా లేడు. బీసీసీఐ ఇప్పటికే వరల్డ్ కప్ కి ఆడబోయే 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేయగా అందులోని ఒక్క ప్లేయర్ కూడా ఈ రెండు లేడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl

సంబంధిత వార్తలు: