ఓటముల తర్వాత విజయాలు.. నిన్నటి గెలుపు తర్వాత ఎమోషనల్ అయినా విరాట్.. అనుష్క..!

Pulgam Srinivas
నిన్న రాత్రి 7 గంటల 30 నిమిషాలకు బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. కీలకమైన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు లో రచిన్ , రుత్ రాజ్ , మిచల్ , ధోని , శార్దూల్ ఠాకూర్ , తుషార్ దేశ్ పాండే , మహేష్ తీక్షణ , సమర్జిత్ సింగ్ అడగా ... బెంగళూరు జట్టులో కోహ్లీ , డూప్లెసెస్ , మాక్స్ వెల్ , దినేష్ కార్తీక్ , లొమ్రెర్ , కర్ణ శర్మ , సిరాజ్ , లాకి పే ర్గుసన్ ఆడారు.

ఈ మ్యాచ్ గెలిచిన వారే ప్లే ఆప్స్ లోకి వెళ్లే అవకాశం ఉండడంతో ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఎంతో కీలకమైన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు భారీ స్కోరును చెన్నై ముందు ఉంచింది. ఆ స్కోర్ ను చేదించడంలో చెన్నై ఫెయిల్ అయ్యింది. దానితో బెంగళూరు జట్టు భారీ తేడాతో చెన్నై ని ఓడగోట్టి ప్లే ఆప్స్ లోకి వెళ్ళింది. ఇక మొదటి ఎనిమిది మ్యాచ్ లలో ఒకే మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ ఆశలను చాలా వరకు కోల్పోయిన బెంగళూరు ఆ తర్వాత ఆరు మ్యాచ్ లలో 6 గెలిచి ప్లే ఆప్స్ లోకి వెళ్లడంతో విరాట్ మరియు అతని భార్య అయినటువంటి అనుష్క శర్మ మ్యాచ్ అనంతరం ఎమోషనల్ అయ్యారు.

ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆప్స్ లోకి వెళ్లడంతో ఈ జట్టు ఆటగాళ్లు మరియు కోహ్లీ అతని భార్య అనుష్క శర్మ భావద్వేగానికి గురైన సన్నివేశాలు వైరల్ గా మారాయి. ఆఖరి ఆరు మ్యాచ్ లలో ఆరింట్లో గెలుపొంది ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెంగళూరు మిగిలి ఉన్న మరో మూడు మ్యాచ్ లను కూడా గెలుపొంది ట్రోఫీని దక్కించుకుంటుంది అని బెంగుళూరు జట్టు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: