అతని వల్లే ఓడిపోయామ్.. కమిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
ఐపీఎల్ పోరు ప్రస్తుతం మరింత రసవత్తరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ప్లే ఆఫ్ కి సమయం దగ్గర పడుతుండటంతో అన్ని టీమ్స్ కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నాయ్. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ ఏడాది  బ్యాటింగ్లో బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట్లో వరుస విజయాలు సాధించినప్పటికీ ఇక ఇప్పుడు మాత్రం వరుస ఓవటములతో సతమతమవుతుంది అని చెప్పాలీ.

 అయితే ఇటీవల అటు ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. అయితే మొదట బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా సన్రైజర్స్ బ్యాటింగ్ విభాగం విఫలం కావడంతో ఇక అతి తక్కువ పరుగులకే పరిమితం కావలసిన పరిస్థితి వచ్చింది. దీంతో 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే 174 పరుగుల లక్ష్యంతో బలిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మొదట కాస్త తడబడినట్లు కనిపించినప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగి  పోవడంతో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఏకంగా 12 ఫోర్లు ఆరు సిక్సర్లతో 102 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు సూర్య కుమార్ యాదవ్.

 అయితే ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ అనంతరం మాట్లాడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తక్కువ పరుగులు చేయడమే తమ ఓటమికి కారణం అంటూ చెప్పుకొచ్చాడు. వాంకడే లో ఎప్పుడైనా వీలైనంత పరుగులు ఎక్కువ చేయాలి. అప్పుడే మన మ్యాచ్ లో ఉన్నామనే భావన కలుగుతుంది. అయితే ఈ పిచ్ నుంచి బౌలింగ్లో అడ్వాంటేజ్ లభించడంతో మ్యాచ్ రేసులో నిలిచాము. ఇక సన్వీర్ సహాయంతో 170 పరుగులు మార్కులు అందుకున్నాం. వాస్తవానికి మేము ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్ను ఆడించాలని అనుకున్నాం. కానీ టి20 క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. సూర్య అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ముంబైలో ఆడిన మాకు హోం గ్రౌండ్లో ఆడిన అనుభూతి కలిగింది. అయితే సూర్య అద్భుతమైన ఇన్నింగ్స్ మా ఓటమిని శాసించింది అంటూ చెప్పుకొచ్చాడు కమిన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: