అది కోహ్లీకి కూడా అసాధ్యం... వీరేంద్ర సెహ్వాగ్..!

Pulgam Srinivas
"ఐ పీ ఎల్" సీజన్ ప్రారంభం అయ్యింది అంటే చాలు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అభిమానులు కచ్చితంగా ఈ సారి మా టీం కప్ప కొడుతుంది అనే ఆశ భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా వారు కచ్చితంగా ఈ సారి బెంగళూరు కప్పు ను గెలుస్తుంది అని ఫుల్ జోష్ తో రెచ్చిపోతూ ఉంటారు. అందులో భాగంగా కొన్ని సార్లు బెంగుళూరు అద్భుతమైన ప్రదర్శనలు కనబరుస్తూ కప్పును కొట్టే విధంగా ప్రదర్శన ఇచ్చిన లాస్ట్ లో గేమ్ నుండి వెళ్లిపోతుంది. కొన్ని సార్లు వీరు పేలవమైన ప్రదర్శనతో బయటకు వెళ్లి పోతున్నారు.

ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న "ఐ పి ఎల్" సీజన్ లో కూడా బెంగళూరు చాలా పేలవమైన ప్రదర్శనను కనబడుతుంది. ఇప్పటి వరకు ఈ జట్టు నాలుగు మ్యాచ్ లను ఆడింది. అందులో కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చాలా కిందన ఉంది. ఇక మిగిలి ఉన్న మ్యాచ్ లలో ఈ జట్టు ఎక్కువ శాతం మ్యాచ్ లను గెలిస్తేనే సెమీస్ కి వెళ్లే అవకాశం ఉంది.

ఈ జట్టు సెమిస్ అవకాశాల గురించి తాజాగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ... బెంగళూరు జట్టు ఈ సారి విజేత గా నిలవాలి అంటే విరాట్ కోహ్లీ ఒకటి పైనే ఆధార పడడం ఏ మాత్రం సరికాదు అని సూచించారు. ఏకంగా 7 , 8 మ్యాచ్ లను గెలిపించే ఇన్నింగ్స్ లను ఆడడం కోహ్లీ కి కూడా సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపోతే ఈ సీజన్ ప్రారంభం కంటే ముందు బెంగుళూరు జట్టు అభిమానులు కోహ్లీ , డూప్లిసిస్ , మాక్స్వెల్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇందులో కోహ్లీ ని మినహాయిస్తే డూప్లిసిస్ , మాక్స్వెల్ పెద్దగా రాణించడం లేదు. దానితో ఈ జట్టు భారీ విజయాలను అందుకోలేక పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: