పురాతన సమాదిని తవ్వుతుండగా.. షాకింగ్ దృశ్యం.. అందరూ అవాక్?

praveen
సాధారణంగా తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఎన్నో సార్లు ఇక పురాతన వస్తువులు బయటపడటం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇంకొన్నిసార్లు ఏకంగా బంగారం లేదా నిధులు దొరుకుతాయి అని ఆశపడుతూ ఉన్న సమయంలో చిత్ర విచిత్రమైన వస్తువులు కూడా బయటపడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఏకంగా బతికున్న తాంబేలు లేదంటే నాగుపాములు లాంటివి కూడా ఈ తవ్వకాలలో బయటపడటం చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి తరహా ఘటనలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అప్పుడప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారిపోతుంటాయి అని చెప్పాలి.

 అయితే సాధారణంగా ఇల్లు లేదా ఏదైనా పాత కట్టడం ఉన్నచోట ఇలాంటి తవ్వకాలు జరిపినప్పుడు  పురాతనమైన వస్తువులు బయటపడటం చూస్తూ ఉంటాం. అలాంటిది ఏకంగా ఒక సమాధి దగ్గర తవ్వుతున్న సమయంలో ఇక్కడ ఒక షాకింగ్ సీన్ కనిపించింది. దీంతో అక్కడున్న వారందరూ కూడా ఒకసారిగా షాక్ లో మునిగిపోయారు. ఏకంగా సమాధి తవ్వుతున్న సమయంలో వింత వింత వస్తువులు బయటపడ్డాయ్. ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.

 మధ్య అమెరికా పరిధి పనామాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పనామాకు చెందిన పురావస్తు శాఖ అధికారులు ఇటీవల చేపట్టిన తవ్వకాలలో  ఒక షాకింగ్ వెలుగు చూసింది. ఎల్ కాను ఆర్కియాలజికల్ పార్కులో ఉన్న పనామాలో ఉన్న వర్గానికి చెందిన ప్రభువు సమాధిని తవ్వారు పురావస్తు శాఖ అధికారులు. ఈ క్రమంలోనే ఇలా తవ్వుతుండగా షాకింగ్ దృశ్యం కనిపించింది. కొంత దూరం తవ్వగానే కొన్ని శిలామిక్ వస్తువులు బయటపడ్డాయి. మరి కొంత దూరం తవ్వగా బంగారు వస్తువులు కనిపించాయి. ఇక ఆ వస్తువులు ఏకంగా క్రీస్తు శకం 750 - 800 మధ్య కాలం నాటివి అన్న విషయాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఆ ప్రాంతంలో ఒకే చోట అనేక మృతుదేహాలు ఖననం చేసినట్లు గుర్తించారు అధికారులు. ఇలా సమాధిలో దొరికిన వస్తువుల్లో బంగారు దుస్తులతో పాటు పూలకారంలోని బంగారు పూసలతో కూడిన దుద్దులు, 2 బెల్టులు, నాలుగు కంకణాలు, మానవులు ఆకారంలో ఉండే రెండు చేవి దుద్దులు, నెక్లెస్లు, పిల్లన గోవితో పాటు ఒక స్కర్ట్ ఉంది అన్న విషయాన్ని కూడా వివరించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: