ధోని టీమ్ కి బిగ్ షాక్.. జట్టును గెలిపించిన బౌలర్ కి గాయం?

praveen
ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వరల్డ్ క్రికెట్లోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కూడా పేరు సంపాదించుకుంది ఐపీఎల్. అయితే ప్రస్తుతం ఇక 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి సంబంధించిన అన్ని సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే బీసీసీఐ ఇందుకు సంబంధించిన షెడ్యూల్  కూడా విడుదల చేసింది అన్న విషయం తెలిసిందే  మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ టోర్ని జరగబోతుంది. ఈ క్రమంలోనే ఇక అన్ని ఫ్రాంచైజీలు కూడా క్యాంపులను ఏర్పాటు చేసి ఆటగాళ్ను ఇక క్యాంపులో చేర్చుకుంటున్నాయి.

 ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ ఏడవడమే లక్ష్యంగా అస్త్ర శాస్త్రాలను కూడా సిద్ధం చేసుకుంటున్నాయ్ అన్ని జట్లు. ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది డిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగబోతుంది చెన్నై సూపర్ కింగ్స్. గత ఏడాది అద్భుతమైన ప్రదర్శన చేసి టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి కూడా వేలంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన చెన్నై.. ఇక ఎంతోమంది కొత్త ఆటగాళ్లను జట్టులో చేర్చుకుంది. కొంతమంది పాత ఆటగాళ్లను కూడా జట్టుతోనే అంటిపెట్టుకుంది. అలాంటిది చెన్నై సూపర్ కింగ్స్ కి గత కొంతకాలం నుంచి మాత్రం వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి.

 ఇప్పటికే గాయం బారిన పడిన పలువురు ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో ఉంటారా లేదా అనే విషయంపై అనుమానాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో కీలక బౌలర్ కూడా గాయం బారిన పడ్డాడు అన్నది తెలుస్తోంది. శ్రీలంక బౌలర్ పతీరన ఇటీవల గాయంతో బంగ్లాదేశ్తో జరిగే టి20 మ్యాచ్ కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో కండరాలు పట్టేయడంతో టీం మేనేజ్మెంట్ అతని జట్టు నుంచి తప్పించింది. మరో రెండు వారాల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. పతిరణ గాయం చెన్నై అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే గత ఏడాది అతను అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర వహించాడు. దీంతో ఇక వేలంలోకి వదిలేయకుండా అతని రిటైన్ చేసుకుంది జట్టు యాజమాన్యం. ఒకవేళ అతను దూరమైతే మాత్రం చెన్నై జట్టుకు బిగ్ షాక్ తగిలినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: