RCB ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్.. ఎబిడి మళ్లీ వచ్చేస్తున్నాడు?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయినప్పటికీ చాంపియన్ టీమ్స్ గా కొనసాగుతున్న చెన్నై, ముంబై జట్లతో సమానంగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న టీం ఏదైనా ఉంది అంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రమే అని చెప్పాలి. ఈ జట్టులో మహా మహా ప్లేయర్లు ఉన్నా.. ఎందుకో ఒకసారి కూడా టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ అభిమానులను నిరాశ పరుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు 2024 ఐపిఎల్ సీజన్లో తప్పనిసరిగా టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతుంది.

అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరు వినిపించింది అంటే చాలు ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చే ఆటగాడు విరాట్ కోహ్లీ. ఎందుకంటే అతని కెప్టెన్సీ లోనే ఆ జట్టుకి ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే కోహ్లీ తర్వాత ఇక ఆర్సిబి పేరు చెబితే గుర్తొచ్చే ప్లేయర్ ఏపీ డివిలియర్స్. ఇద్దరు ఆటగాళ్ళు కూడా జట్టును ఎంతో విజయపతంలో ముందుకు నడిపించేందుకు చాలా కష్టపడ్డారు. ఇక వీరిద్దరూ కూడా ప్రాణ స్నేహితులు కావడం గమనార్హం. అయితే ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్లో ఆడుతుండగా ఎబి డివిలియర్స్ మాత్రం రిటైర్మెంట్ ప్రకటించాడు.

 అయితే ఈ సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడు మళ్లీ ఐపీఎల్లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మళ్ళీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి రాబోతున్నాడట. అయితే ఈసారి ఆటగాడిగా కాదు కోచింగ్ స్టాఫ్ లో ఎబి డివిలియర్స్ ను చూసే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. బ్యాటింగ్ కన్సల్టెంట్గా ఈ సీజన్  నుండి ఆర్సిబికి ఎబి డివిలియర్స్ వ్యవహరించబోతున్నాడట. ఇదిలా ఉంటే మరోవైపు ఏపీ డివిలియర్స్ 2024 ఐపీఎల్ సీజన్లో కామెంటెటర్  అవతారం ఎత్తబోతున్నాడు అంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఏబీడీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. నిజంగానే అతను ఆర్సిబి జట్టులోకి వస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: