ఐపీఎల్ లో.. ధోని చెప్పిన కొత్త పాత్ర అదే అయ్యుంటింది : వెంకటేష్

praveen
ఇండియన్ క్రికెట్ లో ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే 2019లో ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక అప్పటి నుంచి అటు ఐపీఎల్ లో మాత్రమే ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. చెన్నై కెప్టెన్ గా తనదైన ఆట తీరుతో కెప్టెన్సీ తో ఆకట్టుకుంటున్నాడు. అయితే ధోని ఇంటర్నేషనల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన నాటి నుంచి కూడా ఇక ఐపీఎల్ కెరీర్ కు ఇదిగో రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అదిగో రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అంటూ ప్రతి ఏడాది కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి.

 కానీ ధోని మాత్రం ప్రతి ఐపీఎల్ సీజన్లోకి కూడా ఇక కెప్టెన్ గా బరిలోకి దిగుతూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ధోని కెప్టెన్సీలో మరోసారి డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగేందుకు  సిద్ధమైంది. అయితే ఇక ధోని ఈసారి అదరగొడతాడు అని అందరూ అనుకుంటున్నారూ. కాగా ఇటీవల ధోని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారిపోయింది. కొత్త సీజన్ కొత్త పాత్ర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో ధోని సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించి కోచ్ అవతారం ఏమైనా ఎత్తబోతున్నాడ ఏంటి అనిఅందరూ కన్ఫ్యూషన్ లో మునిగిపోయారు.

 ఇక ఇదే విషయం గురించి పలువురు మాజీ ఆటగాళ్లు కూడా స్పందించారు అని చెప్పాలి  కాగా మహేంద్ర సింగ్ ధోని పెట్టిన ఈ పోస్టు గురించి ఇక టీమిండియా మాజీ ప్లేయర్ సి వెంకటేష్ స్పందించారు. నా అంచనా ప్రకారం ధోని ఋతురాజ్ గైక్వాడ్ తో కలిసి ఓపెనింగ్ చేయొచ్చు అంటూ అభిప్రాయపడ్డాడు సి వెంకటేష్. పవర్ ప్లే ఓవర్లను పూర్తిగా ఉపయోగించుకోవడానికి ధోని ఈ వ్యూహం అమలు చేయొచ్చు అంటూ సోషల్ మీడియాలో స్పందించాడు. అయితే ఎవరెన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసిన ధోని పోస్ట్ మాత్రం అభిమానులు అందరిలో కూడా కలవరం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: