కోహ్లీ సెలవులు తీసుకుంది.. ఎందుకో తెలిసిపోయింది?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుతం జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఫిట్నెస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక క్రికెట్ ని ఫ్యాషన్ గా మార్చుకొని ముందుకు సాగే ఆటగాళ్లకి అతను ఒక మార్గదర్షిగా నిలుస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇంతలా ఫిట్నెస్ మైంటైన్ చేస్తాడు కాబట్టి విరాట్ కోహ్లీ అందరి ఆటగాళ్ళలా గాయాల బారిన పడటం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఇక ఈ మధ్యకాలంలో మాత్రం విరాట్ కోహ్లీ తరచుగా అటు టీమిండియాకు దూరంగానే ఉంటున్నాడు. అతను గాయం బారిన పడలేదు. కానీ ఎందుకు వరుసగా సెలవులు తీసుకుంటున్నాడు అన్నది మాత్రం ప్రస్తుతం భారత క్రికెట్ లో చర్చనీయాంశంగా మారిపోయింది.

 ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతూ ఉండగా.. కోహ్లీ మాత్రం ఈ టెస్ట్ సిరీస్ కి పూర్తిగా దూరంగానే ఉన్నాడు. అతను సెలవులు కోరడంతో బీసీసీఐ సెలెక్టర్లు కూడా వెంటనే మంజూరు చేశారు. అయితే కోహ్లీ ఎందుకు సెలవులు తీసుకున్నాడు అనే విషయంపై మాత్రం చర్చ జరుగుతుంది. కొన్ని రోజులపాటు విరాట్ కోహ్లీ తల్లికి అనారోగ్యం ఉండడం కారణంగానే ఆమెకు దగ్గరగా ఉండడం కోసం కోహ్లీ సెలవులు తీసుకున్నారంటు వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా అవాస్తవమని కోహ్లీ సోదరుడు స్పష్టం చేశాడు. అయితే కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడని అందుకే డెలివరీ సమయంలో భార్యతో ఉండడానికే న్యూస్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. ఇది కూడా అవాస్తవం తేలింది.

 అయితే విరాట్ కోహ్లీ ఎందుకు లీవ్స్ తీసుకున్నాడు అనే విషయంపై ఇక ఇప్పుడూ మరో వార్త వైరల్ గా మారిపోయింది. విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ విదేశాల్లో ట్రీట్మెంట్ చేయించుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కోహ్లీ దంపతులు విదేశాలకు వెళ్లారట. అనుష్క అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే మెరుగైన చికిత్స కోసం విదేశాల్లోని వైద్యుడిని సంప్రదించారట కోహ్లీ దంపతులు. ఈ సమయంలో భార్యకు తోడుగా ఉండడానికి కోహ్లీ లీవ్ తీసుకున్నాడు అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: