టీమిండియాలో.. వారి కథ ముగిసినట్లేనా?
గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో దావన్ అతని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో అతని కెరియర్ ముగిసింది అన్న విషయం ఇక అభిమానులకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు పూజారా, రహేనే కెరియర్ కూడా ముగిసిపోయినట్లు తెలుస్తోంది. అయితే పూజార ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతూ డబుల్ సెంచరీలు, సెంచరీలు అంటూ చెలరేగిపోతున్నాడు. దీంతో అతనికి ఇంగ్లాండుతో మిగిలి ఉన్న మూడు టెస్టుల్లో అయినా ఛాన్స్ దక్కుతుందని ఊహించారు అందరు. కానీ ఇటీవలే మూడు టెస్ట్ మ్యాచ్లకు సంబంధించిన జట్టును ప్రకటించగా పూజారను మరోసారి సెలెక్టర్లు పట్టించుకోలేదు.
దీంతో ఇక ఇటీవల ప్రకటించిన టెస్టు జట్టులో సీనియర్ ప్లేయర్లు పూజార, రహనేలకు చోటు తగ్గకపోవడం మరోసారి చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కి వీరిద్దరని పూర్తిగా పక్కన పెట్టేయడం పలు ప్రశ్నలకు కూడా తావిస్తుంది. దీంతో వీరి కెరియర్ ముగిసినట్లే అని క్రీడా విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్తవారికి ఛాన్స్ ఇచ్చేందుకే బీసీసీఐ కలెక్టర్లు వీరిని పక్కన పెట్టారు అని మరికొంతమంది వాదిస్తున్నారు. అయితే రంజి ట్రోఫీలో సూపర్ ఫామ్ లో ఉన్న సీనియర్ ప్లేయర్ పూజారని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం లో మునిగిపోయారు.