రీ ఎంట్రీ.. మొదటి మ్యాచ్ లోనే పృథ్వి షా సెంచరీ?
అయితే అతను భారత జట్టు తరపున మ్యాచ్ ఆడి దాదాపు ఏడాదికి పైగా కాలం గడిచిపోతుంది. అయితే ఐపీఎల్లో కాస్తో కూస్తో రాణిస్తున్న సెలెక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు. అయితే నిలగడలేమిటో ఇబ్బంది పడుతున్న పృథ్వి షా.. ఇటీవల కాలంలో ఫిట్నెస్ గురించి మరిచిపోయి భారీగా బరువు కూడా పెరిగిపోవడం చూశాము. అయితే అనవసరమైన వివాదాల్లో కూడా చిక్కుకుంటూ అటు కెరియర్ ను మరింత ప్రమాదంలో పడేసుకుంటూ ఉన్నాడు పృథ్వి షా. అయితే మొన్నటి వరకు రంజీ మ్యాచ్ లు కూడా ఆడలేదు. ఇక ఇప్పుడు ఏకంగా మళ్లీ రంజీ ట్రోఫీలో రీ ఎంట్రీ ఇచ్చాడు.
అయితే అతని ప్రదర్శన ఎలా ఉంటుందో అనే విషయంపైనే అందరూ చర్చలు జరిపారు అని చెప్పాలి. అయితే ఇక రీఎంట్రీలో మాత్రం అదరగొడుతున్నాడు ఈ యువ ఆటగాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఇటీవల చత్తీస్గఢ్ తో జరుగుతున్న మ్యాచ్లో. ముంబై ఓపెనర్ గా బరిలోకి దిగి చెలరేగిపోయాడు. 185 బంతుల్లోనే 18 ఫోర్లు మూడు సిక్సర్లతో 159 పరుగులు చేశాడు. ఇక మరో ఓపనర్ లాల్బాని తో కలిసి ఏకంగా తొలి వికెట్ కు 240 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అని చెప్పాలి. అయితే అతను రంజీ ట్రోఫీలో ఇలాగే రానిస్తే రానున్న రోజుల్లో టీమ్ ఇండియాలోకి వచ్చే ఛాన్స్ లు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ విశ్లేషకులు.