రంజీ ట్రోఫీలో అదరగొడుతున్న.. బాలీవుడ్ డైరెక్టర్ కొడుకు?
ఇక ఎంతోమంది క్రికెటర్లు క్రికెట్ ను ప్యాషన్ గా మార్చుకొని ముందుకు సాగిన తర్వాత కనీసం రంజీ ట్రోఫీలో అయిన ఆడాలని ఆశపడేవారు. ఇక రంజీ ట్రోఫీలో బాగా రాణించిన వారికి ఎంతో సులభంగా జాతీయ జట్టులో కూడా అవకాశాలు దక్కేవి అని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు 2024 రంజి ట్రోఫీ సీజన్ జరుగుతుంది. ఇందులో భాగంగా జరుగుతున్న వరుసగా మ్యాచ్ లలో ఎంతో మంది యువ ఆటగాళ్లు అదిరిపోయే ప్రదర్శన చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి.
ఈ క్రమం లోనే ఒక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు కూడా రంజి ట్రోఫీలో అదరగొడుతున్నాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. 12th ఫెయిల్యూర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ విధు వినోద్. అయితే ఆయన కుమారుడు అగ్ని చోప్రా ప్రస్తుతం రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆడుతున్నాడు. మిజోరాం జట్టు తరఫున అతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వరుసగా మ్యాచ్ లలో సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. సిక్కింతో జరిగిన మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో కూడా 162, 92 పరుగులు చేశాడు. తాజాగా నాగాలాండ్ పై తొలి ఇన్నింగ్స్ లో 164 పరుగులతో అదరగొట్టాడు.