భార్య అందంగా ఉందని.. ఈ రాక్షసుడు ఎంత పని చేసాడో తెలుసా?

praveen
అందమైన భార్య రావాలని అర్థం చేసుకునే సతీమణి దొరకాలని ప్రతి ఒక్క యువకుడు కూడా ఆశపడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఆడవాళ్ళలా పెద్దగా పూజలు చేయకపోవచ్చు కానీ గుడికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలా అందమైన భార్య రావాలని మనసులో కోరుకుంటూ ఉంటాడు ప్రతి ఒక్క అబ్బాయి. ఇక కోరుకున్నట్లుగానే అందమైన అమ్మాయి భార్యగా వస్తే ఆనందానికి అవధులు ఉండవు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం అందమైన అమ్మాయి భార్యగా వస్తే ఆమె అందాన్ని చూసి ఓర్వలేకపోయాడు. దీంతో అనుమానం పెంచుకొని చివరికి దారుణంగా ప్రాణాలు తీసేసాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లలిత్పూర్ సమీపంలో వెలుగులోకి వచ్చింది.

 చాంద్ మారి గ్రామానికి చెందిన నీరజ్ కుష్వ అనే 27 ఏళ్ల వ్యక్తి 2 ఏళ్ళ క్రితం 22 ఏళ్ళ మనీషాను పెళ్లి చేసుకున్నాడు. అయితే వారికి ఏడాది వయస్సున కుమార్తె కూడా ఉంది. కాగా చాంద్ మారి గ్రామంలో నీరజ్ టెంట్ షాప్ నడుపుతూ ఉంటాడు. మనిషా అందంగా ఉండటమే కాకుండా తరచూ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉండేది. అయితే ఆమెకు ఎక్కువ మంది ఫాలోవర్లు కూడా ఉన్నారూ. ఇక ఇది చూసిన నీరజ్ అసలు సహించలేకపోయాడు. భార్యకు విడాకులు ఇచ్చి ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. అయితే ఈ విషయం ముందే గ్రహించిన మనిషా భర్తతో గొడవ పడుతూ ఉండేది.

 ఇటీవల భార్యాభర్తల మధ్య మరోసారి ఇదే విషయంపై గొడవ జరగగా.. కోపం పట్టలేకపోయినా నీరజ్ ఏకంగా భార్య మనీషాను కూతురుని కూడా క్రికెట్ బ్యాట్ తో దారుణంగా కొట్టాడు. దీంతో దెబ్బలు తాళలేక భార్య కూతురు ఇద్దరు కూడా ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత ఇల్లంతా చిందర వందర చేసి ఇంట్లోనీ బంగారు నగలను దాచిపెట్టి పోలీసులకు కబురు పెట్టాడు. తన ఇంటి పై ఆరుగురు దుండగులు దాడి చేసి భార్య కూతురుని చంపేసి ఇల్లంతా దోచుకుని పోయారు అంటూ కట్టు కథ  అల్లాడు. దొంగలు తనను కూడా కొట్టారని స్వయంగా గాయాలు చేసుకున్నాడు. కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లను గమనించిన పోలీసులు నీరజ్ పై అనుమానంతో విచారించగా అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: