రిషబ్ పంత్.. మళ్ళీ టీమ్ లోకి వచ్చేది ఎప్పుడో తెలుసా?

praveen
భారత జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న రిషబ్ పంత్ గత కొన్ని నెలల నుంచి క్రికెట్కు దూరంగానే ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్లో ఘోర రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు రిషబ్ పంత్. ఈ క్రమంలోనే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు అని చెప్పాలి. అతని కాలు కూడా విరిగింది. ఈ క్రమంలోనే దాదాపు కొన్ని నెలల నుంచి క్రికెట్ కి దూరంగానే ఉంటున్నాడు. అయితే ఇక వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం కోలుకుంటున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ ఫిట్నెస్ సాధిస్తున్నాడు అన్నదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాయి.


 అయితే రిషబ్ పంత్ ఎప్పుడెప్పుడు క్రికెట్లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తాడా అని అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే రిషబ్ పంత్ ఇక భారత జట్టులోకి వచ్చాడు అంటే ఇక భారత జట్టు ఎంతో పటిష్టంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో తాను సరైన ఆటగాడిని అన్న విషయాన్ని ఇప్పటికే తన ఇన్నింగ్స్ లతో నిరూపించాడు. అయితే ఇక ఇప్పుడు రిషబ్ పంత్ గురించి ఒక ఆసక్తికర విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా  మారిపోయింది. యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ త్వరలోనే టీమ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు క్రికెట్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది.


 యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ త్వరలోనే టీం లోకి ఎంటర్ ఇవ్వబోతున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం పూర్తిగా గాయాలనుంచి కోలుకుని రిషబ్ పంత్ ఫిట్నెస్ కూడా సాధించాడట. అయితే తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు ముందుగా దేశవాళీ క్రికెట్ ఆడబోతున్నట్లు తెలుస్తుంది. అయితే కొన్ని నెలలుగా నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు రిషబ్ పంత్. ఈ క్రమంలోనే ఇక విజయ్ హజారే ట్రోఫీలో ఆడబోతున్నట్లు సమాచారం. ఇక చివరిసారిగా టీమిండియాతో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన రిషబ్ పంత్.. ఇక ఆ సమయంలో భారత జట్టుకు ఆడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: