యోయో టెస్ట్ కు.. ఆ 5గురూ ప్లేయర్లు హాజరు కాలేదట తెలుసా?
ఒకవేళ యోయో టెస్టులో ఫెయిల్ అయ్యారు అంటే వారిని నిర్మోహమాటంగా సెలెక్టర్లు పక్కన పెట్టడం చేస్తూ ఉంటారు. యోయో టెస్టులో ఆటగాడు పాస్ కావడానికి 16.5 స్కోర్ తప్పక చేయాల్సి ఉంటుంది. అయితే ఇక ఆసియా కప్ కి ముందు అటు ప్లేయర్స్ అందరికి కూడా బీసీసీఐ యోయో టెస్ట్ నిర్వహించింది. ఇందులో గిల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు ఇప్పటికే పాస్ అయిపోయారు. ఇక వీళ్లు మాత్రమే కాకుండా ఆసియా కప్ కోసం సెలెక్ట్ చేసిన మిగతా ప్లేయర్లు కూడా పాస్ అయ్యారట. కానీ కొంతమంది ప్లేయర్స్ మాత్రం అటు యోయో టెస్ట్ కు హాజరు కాలేదట. బుమ్రా, సంజూ, తిలక్ వర్మ, ప్రసిద్ధి కృష్ణ, కేఎల్ రాహుల్ యోయో టెస్ట్ కు హాజరు కాలేదు అన్నది తెలుస్తుంది.
అయితే ఈ ఫిట్నెస్ టెస్ట్ నుంచి ఐదుగురికి సెలెక్టర్లే మినహాయింపు ఇచ్చారట. వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ పరంగా కేఎల్ రాహుల్ జట్టుకు ఉపయోగపడతాడని ఆలోచనతోనే ఆసియా కప్ కోసం అతని ఎంపిక చేశారు. అయితే గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ పూర్తి పెట్టిన సాధించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో యోయో టెస్ట్ చేసిన అతను పాస్ కాడనే ఆలోచనతోనే ఇక అతన్ని టెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చారట. ఇక బుమ్రా తిలక్ వర్మ ప్రసిద్ధి కృష్ణ సంజు ల ఆట దృష్టిలో పెట్టుకొని వారికి యోయో టెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.