నేను ఆడినట్లు.. పూజార ఆడలేడు : పృథ్వి షా

praveen
టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వి షా గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. బాణం కంటే వేగంగా టీమిండియాలోకి దూసుకు వచ్చాడు ఈ క్రికెటర్. ఇలా టీమ్ ఇండియాలోకి అడుగు పెట్టిన కొత్తలో తన బ్యాటింగ్ తో ఎన్నో మెరుపులు మెరిపించాడు. అయితే ఎంత వేగంగా అయితే టీమిండియాలోకి వచ్చాడో.. అంతే వేగంగా మళ్ళీ జట్టులో స్థానం కోల్పోయాడు అని చెప్పాలి. దేశ వాళి క్రికెట్లో యువ సంచలనంగా పేరు సంపాదించుకున్న పృథ్వి షా.. సెలెక్టర్లు చూపును ఆకర్షించి టీమ్ ఇండియాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. అంతేకాదు టీమ్ ఇండియాలోకి వచ్చిన తర్వాత సచిన్ వారసుడు అంటూ అతనికి ఒక అరుదైన బిరుదును కూడా కట్టబెట్టారు భారత క్రికెట్ ప్రేక్షకులు.


 కానీ ఇక భారత క్రికెట్ ప్రేక్షకులు అతనికి ఇచ్చిన బిరుదును అతను నిలబెట్టుకోలేకపోయాడు. కొన్ని మ్యాచ్లలో మెరుపులు మెరూపించిన పృథ్వి షా ఆ తర్వాత నిలకడలేమితో జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక దేశవాళీ క్రికెట్లో రాణించి పలుమార్లు జట్టులోకి వచ్చిన మళ్లీ అలాంటి వైఫల్యాన్ని కొనసాగించాడు. దీంతో సెలెక్టరు ప్రతి విషయాన్ని జట్టు ఎంపిక విషయంలో ప్రతిసారి పక్కన పెట్టడం చేస్తూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న దిలీప్ ట్రోఫీ లో  కూడా పృథ్వి షా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు అని చెప్పాలి.


 అతని ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కాగా తనపై వస్తున్న విమర్శల గురించి స్పందించిన పృథ్వి షా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగతంగా తన ఆట తీరు మార్చుకోవాలని అనుకోవడం లేదు అంటూ ఈ యంగ్ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. అయితే తెలివిగా ఆడేందుకు ప్రయత్నిస్తాను అంటూ తెలిపాడు. నేను ఆడినట్లు పూజార ఆడలేరూ.. అదే సమయంలో అతని మాదిరి నేను కూడా ఆడలేను. అందుకే నా లాగే నేను ఆడతా.. నా దూకుడుని కొనసాగిస్తా.. దేశవాళీ టోర్నీలో బాగా రాణించినప్పుడే టీమ్ ఇండియాలో ఎంపిక కావడానికి అవకాశాలు వస్తాయి అంటూ పృథ్వి షా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: