బౌలర్‌ పెట్టిన బిక్షతో.. మ్యాచ్‌ను ముగించాడు?

praveen
క్రికెట్ అంటే ఇష్టముండని వారు ఉండరేమో. t20 వరల్డ్ కప్ అయిపోయింది, డబ్ల్యూటిసి కూడా అయిపోయింది. ఈ రెండు మ్యాచుల్లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీం ఇండియా ద్రుష్టి మొత్తం వన్ డే వరల్డ్ కప్ పైనే. అందులో వన్ డే వరల్డ్ జరిగేది ఇండియాలోనే. దీంతో అన్ని జట్లు కూడా వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వే ఆతిథ్యమిస్తున్న ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ప్రతి జట్టు నువ్వా నేనా అన్నట్టు చివరి వరకు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా వెస్టిండీస్‌, జింబాబ్వే,శ్రీలంక జట్లు మాత్రం అదరగొడుతున్నాయి. అయితే  బుధవారం స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ మధ్య లీగ్‌ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఒక చిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. దీనికి సంబంచిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. వారు బిక్ష పెట్టినందుకే మీరు గెలిచారు అనే కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందో ఇప్పుడు చూసేద్దాం.

స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను రనౌట్‌(మన్కడింగ్‌) చేసే ప్రయత్నం చేయడం జరిగింది. స్కాట్లాండ్‌కు ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు కావాలి. ఆఖరి ఓవర్‌ మార్క్‌ అడైర్‌ వేశాడు. అడైర్‌ వేసిన తొలి రెండు బంతులకు ఫోర్‌ సహా సింగిల్‌ తీశాడు. అయితే మూడో బంతికి ఒక సంఘటన జరిగింది. మూడో బంతిని వేసే సమయంలో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న లీస్క్‌ క్రీజు బయటికి వచేసాడు. ఇది గమనించిన మార్క్‌ అడైర్‌ బంతి వేయడం ఆపేసి మన్కడింగ్‌ చేసే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన లీస్క్‌ వెంటనే వెనక్కి వెళ్ళాడు. అయితే మన్కడింగ్‌ మిస్ అయిన లీస్క్‌ ఆఖరి బంతికి ఫోర్‌ కొట్టి స్కాట్లాండ్‌కు విజయాన్ని అందించాడు. ఈ ఫోర్ తో స్కాట్లాండ్‌ మరిచిపోలేని విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఆ రన్ అవుట్ చేసి ఉంటే ఐర్లాండ్‌ గెలిచేదని, ఆ బౌలర్ పెట్టిన బిక్ష వల్లే స్కాట్లాండ్‌ గెలిచిందని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: