క్రికెట్‌లో వికెట్ తీస్తే.. ఎవరైనా ఇలా రివేంజ్ తీర్చుకుంటారా?

frame క్రికెట్‌లో వికెట్ తీస్తే.. ఎవరైనా ఇలా రివేంజ్ తీర్చుకుంటారా?

praveen
క్రికెట్ లో తనని బౌల్డ్ చేసారని గ్రౌండ్ లోనే ఒకరిని చంపిన ఘటన వైరల్ అవుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వారి వరకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. టీవీలో క్రికెట్ ఉందంటే చాలు టీవీలకే అతుక్కుపోతారు. ఇక హాలిడేస్ వచ్చాయంటే బ్యాట్ లు పట్టుకొని గ్రౌండ్ లకి వెళ్ళిపోతారు. అయితే కొన్ని సార్లు గ్రౌండ్ లలో క్రికెట్ ఆడేటప్పుడు గొడవలు కూడా జరుగుతుంటాయి. జట్లు గొడవ పడి కొట్టుకుంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూసాం. అయితే క్రికెట్ లో తనని బౌల్డ్ చేసారని ఒకరిని గ్రౌండ్ లోనే చంపిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్నూర్ జిల్లాలోని ఘటంపూర్ మండలం రహ్తి డేరా గ్రామంలో బుదవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూసేద్దాం.

స్థానికంగా ఉన్న గ్రౌండ్ లో పిల్లలు క్రికెట్ ఆడారు. ఈ మ్యాచ్ లో 14 ఏళ్ల బాలుడు, 17 బాలుడిరి క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే అవుట్ అయినా కూడా పిచ్ వదిలి వెళ్ళడానికి ఆ బాలుడు నిరాకరించాడు. దీంతో తన్ని అవుట్ చేసిన బౌలర్ తో గొడవకి దిగాడు. మాట మాట పెరిగి గొడవ పెద్దదైంది. దీంతో అవుట్ అయినా బాలుడికి తన తమ్ముడు కూడా తోడయ్యాడు. ఆ ఇద్దరు కలిసి అవుట్ చేసిన బాలుడిపై గొడవకి దిగారు. తీవ్రంగా కొట్టడమే కాకుండా ఏకంగా గొంతు పిసికి గ్రౌండ్ లోనే చంపేశారు. బాలుడు చనిపోయాడని తెలియగానే అన్నతమ్ములు పారిపోయారు. వెంటనే మృతుడి మందువులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, బాలుడిని చంపిన ఇద్దరికి శిక్ష పడితేనే బాలుడికి అంత్యక్రియలు చేస్తామని, అంత వరకు పోస్ట్ మార్టానికి అనుమతించేది లేదని మృతుడి బంధువులు గొడవకి దిగారు. ఆ తరువాత అధికారులు వారి కుటుంబ సబ్యులకు వారిని శిక్షిస్తాం అని హామీ ఇవ్వడంతో బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. పారిపోయిన ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: