ఐపీఎల్ : సన్రైజర్స్ ఓడింది.. కానీ అతను మనసు గెలిచేసాడు?
ప్రత్యర్థి టీం కి కనీస పోటీ ఇవ్వలేక చివరికి దారుణంగా ఓటమి చవిచూస్తూనే ఉంది. ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో సైతం సన్రైజర్స్ ఇలాగే చెత్త ప్రదర్శన చేసి ఓటమి చవిచూసింది. అయితే ఎంతో దూకుడు మీద ఉన్న గుజరాత్ బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో బౌలర్లు కీలక పాత్ర వహించినప్పటికీ అటు బ్యాటింగ్లో మాత్రం సాధారణ టార్గెట్ ను సైతం సన్రైజర్స్ ఛేదించలేకపోయింది అని చెప్పాలి. చివరికి సన్రైజర్స్ కి మరో ఓటమి తప్పలేదు. అయితే ఇక ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఓడిపోయినప్పటికీ అటు భువనేశ్వర్ కుమార్ మాత్రం అదిరిపోయే హ్యాట్రిక్ సాధించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.
గుజరాత్ తో మ్యాచ్లో చివరి ఓవర్లో సన్రైజర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. చివరి ఓవర్లో రన్ అవుట్ తో పాటు భువనేశ్వర్ మూడు వికెట్లతో అదరగొట్టాడు. దీంతో 200 పరుగులు దాటుతుంది అనుకున్న గుజరాత్ టైటాన్స్ స్కోరు.. 188 పరుగులకే పరిమితమైంది. మొత్తంగా ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ నాలుగు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. అయితే భువనేశ్వర్ కుమార్ ఇలా జట్టును గెలిపించేందుకు ఎంతల పోరాడినప్పటికీ ఆ తర్వాత బ్యాటింగ్ విభాగం పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో చివరికి ఓటమి తప్పలేదు.