కోటి పోతేనేమి.. 8 రేట్లు ఎక్కువ సంపాదించాడుగా?

praveen
ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్ కోహ్లీ తన ఆటతీరుతో వరల్డ్ వైడ్ గా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు.  ఇక సోషల్ మీడియా క్రేజ్ విషయంలో కూడా నేటితరం స్టార్ క్రికెటర్లకు ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఇక ఇలా విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లో అద్భుతం ప్లేయర్గా కొనసాగుతూ ఇప్పటివరకు ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు అని చెప్పాలి. ఇక కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కోహ్లీ దూకుడు అటు అభిమానుల్లో ఉత్సాహం నింపినప్పటికీ.. కొన్ని కొన్ని సార్లు అటు కోహ్లీకి ఇబ్బందులను తెచ్చి పెడుతూ ఉంటుంది.


 ఇటీవల ఐపీఎల్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీకి ఇలాంటిదే జరిగింది అన్న విషయం తెలిసిందే. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులను ఉద్దేశిస్తూ లక్నో మెంటల్ గౌతమ్ గంభీర్ చేసిన చర్యలకు కౌంటర్ గా.. ఇటీవలే లక్నోతో మ్యాచ్లో అటు విరాట్ కోహ్లీ కవ్వింపులకు దిగాడు. దీంతో ఇక మ్యాచ్ చివర్లో అటు గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ ఒకరిని ఒకరు కొట్టుకుంటారేమో అనంతగా గొడవపడ్డారు అని చెప్పాలి. దీంతో ఇక వీరి ప్రవర్తన పై ఆగ్రహం వ్యక్తం చేసిన రిఫరీ మ్యాచ్ ఫీజులో 100% కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


 అయితే ఇక ఇలా మ్యాచ్ ఫీజులో 100% కోత కారణంగా కోటి రూపాయలు పోయినప్పటికీ విరాట్ కోహ్లీకి కొన్ని గంటల్లోనే 8 రేట్లకు పైగా డబ్బులు ఎక్కువగా తిరిగి వచ్చాయి అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఎలా అంటే.. సాధారణంగా కోహ్లీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కోట్ల రూపాయలు వస్తూ ఉంటాయి. ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు 8.9 కోట్లు తీసుకునే కోహ్లీ నిన్న తాను నటించిన గ్రేట్ లెర్నింగ్ యాడ్ ను పోస్ట్ చేశారు. దీంతో కోహ్లీ ఖాతాలో 8.9 కోట్లు వచ్చాయ్. ఈ విషయం తెలిసిన అభిమానులు కోటి పోతే దానికి ఎనిమిది రేట్లు వచ్చింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: