ఏంటి.. అంత పెద్ద గొడవ జరగడానికి.. సిరాజే కారణమా?
ఇకపోతే ఇటీవలే లక్నో బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే కోహ్లీ, గంభీర్ మ్యాచ్ ఫీజు 100% కోత విధించింది బీసీసీఐ. ఇక గొడవకు కారణమైన బౌలర్ నవీన్ ఉల్హాక్ కి 50% కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంత గొడవ జరగడానికి కారణమైన మహమ్మద్ సిరాజ్ ను మాత్రం అటు బీసీసీఐ పట్టించుకోకుండా వదిలేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. అదేంటి గొడవకి సిరాజ్ కి సంబంధం ఏముంది అని అనుకుంటున్నారు కదా.
ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన మహమ్మద్ సిరాజ్ ఓవర్ లో ఆఖరి బంతికి నోబాల్ వేశాడు. అంపైర్ మొదట వైడ్ గా ప్రకటించగా.. థర్డ్ ఎంపైర్ దాని నోబాల్ గా గుర్తించాడు. తర్వాత బంతికి సింగిల్ కూడా తీయనివ్వలేదు మహమ్మద్ సిరాజ్. అయితే బ్యాట్స్మెన్ నవీన్ వుల్ హక్ దగ్గరికి వెళ్లి ఇక కావాలని బంతి వికెట్లకేసి కొట్టాడు సిరాజ్. సిరాజ్ చేసిందానికి నవీన్ ఉల్హక్ ఆశ్చర్యపోయాడు. సంఘటన తర్వాత ఆవేశంతో ఊగిపోయాడు నవీన్ ఉల్ హక్. ఇక తర్వాత ఓవర్ లోనే ఫోర్ బాధటంతో.. విరాజ్ కవ్వింపులకు దిగడంతో చిన్నచిన్నగా మాట మాట పెరిగి పెద్ద గొడవగా మారింది. ఒక రకంగా అంత గొడవ జరగడానికి అగ్గిరాజేసింది మాత్రం సిరాజ్ అని అందరికీ అర్థమైంది కానీ.. ఇది పట్టించుకోకుండా అతని వదిలేసింది బీసీసీఐ.