ఆర్సిబి జట్టుకు షాక్.. కీలక ప్లేయర్ దూరం?

praveen
మార్చ్ 31వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ప్రారంభం కాబోతుంది . ఈ క్రమంలోనే ఇక అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పొందేందుకు అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమైపోయారు అని చెప్పాలి. అన్ని ఫ్రాంచైజీలు  కూడా ప్రతిభ గల ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకొని ఎంతో పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగాలని గట్టిగా ఫిక్స్ అయ్యాయి. ఇలాంటి సమయంలో అటు కొన్ని జట్లకు మాత్రం ఊహించని షాక్ లు తగులుతున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు గాయం బారిన పడుతూ ఇక టోర్నీకి మొత్తం దూరం అవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది.

 ఇలా ఏకంగా కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు చివరికి ఇక జట్టుకు దూరమవుతున్న నేపథ్యంలో జట్టు ప్రణాళికలు మొత్తం తారుమారు అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. అంతేకాదు ఇక కీలక ఆటగాళ్లను దూరం అవడంతో కొన్ని జట్లు కాస్త బలహీనంగా కూడా మారిపోతూ ఉన్నాయి. అయితే ఇక ఐపీఎల్ ప్రారంభానికి ముందు అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా ఇలాంటి ఊహించని షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న యువ ప్లేయర్ గాయం కారణంగా జట్టుకు దూరం కాబోతున్నాడు.

 ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వచ్చిన తర్వాత మంచి ప్రదర్శన చేసి జట్టులో కీలక ప్లేయర్గా మారిపోయాడు రజత్ పటిదార్.  ఇటీవలే అతనికి మడమ గాయం అయినట్లు తెలుస్తుంది. దీంతో ఐపీఎల్ ఫస్ట్ స్టాప్ కి అతను దూరం కాబోతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉంటున్నాడని తెలుస్తుంది. ఇక కోలుకునేందుకు  మూడు వారాల సమయం పడుతుందట. కాగా గత సీజన్లో రజత్ పాటీధర్ అద్భుతంగా రాణించాడు. 152 స్ట్రైక్ రేట్తో 333 పరుగులు చేశాడు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ, కెప్టెన్ డూప్లెసెస్ తర్వాత ఎక్కువ పరుగులు చేసింది రజత్ పటీదార్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb

సంబంధిత వార్తలు: