షాకింగ్ : పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్గా రమిజ్ రజా ఔట్?
ఇలా గత కొంతకాలం నుంచి బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న రమిజ్ రజా ఇక ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవి నుంచి తొలగిపోయే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే ఇందుకు కారణం బీసీసీఐ పై విమర్శలు చేయడం కాదు.. గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేక విమర్శలు ఎదుర్కొంటూ ఉండటమే అన్నది తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల ఇక ఎన్నో ఏళ్ల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది ఇంగ్లాండ్ జట్టు.
ఈ క్రమంలోనే సొంత గడ్డపై అటు పాకిస్తాన్ జట్టు అదరగొడుతుందని అందరూ భావించారు. కానీ ఊహించిన రీతిలో అటు పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ఇంగ్లాండ్ దూకుడైన ఆట తీరు ముందు నిలువ లేకపోయింది పాకిస్తాన్ జట్టు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ను కోల్పోయింది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ నుంచి కూడా నిష్క్రమించింది. సొంత గడ్డపై పాకిస్తాన్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న నేపథ్యంలో ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా ఉన్న రమిజ్ రజాని తప్పించి గతంలో బోర్డు చైర్మన్ గా పనిచేసిన నజం సేతినే మళ్లీ అధ్యక్షుడిగా చేయాలని బోర్డు సభ్యులు అనుకుంటున్నారట.