
టెస్ట్ సిరీస్.. కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డ్?
టి20 ఫార్మాట్లో తన తొలి సెంచరీ అందుకున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్లో మరోసారి సెంచరీ తో నిరీక్షణకు విరాట్ కోహ్లీ తెరదించాడు అన్న విషయం తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన విరాట్ కోహ్లీని ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ తో జరగబోయే తొలి టెస్ట్ లో మరో అరుదైన రికార్డు ఊరిస్తుంది అని చెప్పాలి. ఒకవేళ బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు అంటే ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీ బాదిన ఆటగాడిగా అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు.
మహేళ జయవర్ధనే (2010), సురేశ్ రైనా (2010), తిలకరత్నే దిల్షాన్ (2011), అహ్మద్ షెహజాద్ (2014), తమీమ్ ఇక్బాల్ (2016), కేఎల్ రాహుల్ (2016), రోహిత్ శర్మ (2017), డేవిడ్ వార్నర్ (2019), బాబర్ ఆజమ్ (2022) సరసన చేరతాడు. వీరందరూ కూడా ఒకే క్యాలెండర్లో మూడు ఫార్మట్ లలో కూడా సెంచరీ సాధించిన ప్లేయర్ లుగా కొనసాగుతున్నారు. కాగా ప్రస్తుతం ఫామ్ లో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటికే 72 సెంచరీలు సాధించాడు అన్న విషయం తెల్సిందే.