ఇండియాను భయపెట్టిన ప్లేయర్ కి.. కోహ్లీ గిఫ్ట్?

praveen
విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్ల లిస్టు తీస్తే మొదటి వరుసలో మొదటగా వినిపించే పేరు ఇదే అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ టీమ్ ఇండియాలో అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. అందరిలాగా ఇలా వచ్చి అలా పోయే ఆటగాడిని కాదు వచ్చి అంతర్జాతీయ క్రికెట్లో పాతుకుపోవడమే కాదు చరిత్ర సృష్టించే ఆటగాడిని అన్న విషయాన్ని తన ఆట తీరుతోనే నిరూపించాడు విరాట్ కోహ్లీ. అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే కోహ్లీ ఇక కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి.


 కేవలం భారత్లో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో సైతం కోహ్లీని అభిమానించే వారు చాలామంది ఉంటారు. ఇకపోతే విరాట్ కోహ్లీ ఆట తీర్పు మాత్రమే కాదు అతను మైదానంలో దూకుడుగా ఉండే విధానానికి కూడా ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు అని చెప్పాలి. అయితే మైదానంలో మ్యాచ్ ఆడేటప్పుడు విరాట్ కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత ప్రత్యర్థి ఆటగాళ్లతో అంతే సరదాగా ఉంటాడు అని చెప్పాలి. ఏకంగా స్నేహితుడి లాగా కలిసిపోయి మాట్లాడుతూ ఉంటాడు. అందుకే కోహ్లీ అంటే అభిమానులు తెగ ఇష్టపడుతుంటారు.



 ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ చేసిన పని ఏకంగా అభిమానులను ఫీదా అయ్యేలా చేస్తుంది అని చెప్పాలి. ఇటీవల వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్ లో భాగంగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీం ఇండియాని ఓడించినంత పని చేశాడు. ఈ క్రమంలోనే ఇలా టీమిండియాను భయపెట్టిన లిటన్ దాస్ కూ విరాట్ కోహ్లీ ఒక అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు. మేమందరం డైనింగ్ హాల్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ అక్కడికి వచ్చాడు. తన బ్యాట్ ను లిటన్ దాస్ కూ బహుమతిగా ఇచ్చాడు అంటూ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆపరేషన్ చైర్మన్ జలాల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: