ఏంటి.. భారత్ కావాలనే ఓడిపోయిందా?

praveen
వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా విజయవంతమైన ప్రస్థానం కొనసాగించింది.. వరుసగా రెండు విజయాలతో తమకు తిరుగులేదు అని నిరూపించింది. కానీ ఇటీవలే సమవుజ్జి లాంటి సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ జరగదు అటు టీమిండియా మాత్రం ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో భాగంగా మొదటిసారి నిరాశపరిచింది టీమిండియా. భారత బౌలింగ్ విభాగం మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ అటు బ్యాటింగ్ విభాగం మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అని చెప్పాలి. సూర్య కుమార్ యాదవ్ మినహా మిగతా ఎవరు కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక చివరి నిమిషంలో భారత్ గెలుస్తుంది అనుకుంటున్న సమయంలో సూర్య కుమార్ కూడా వికెట్ కోల్పోవడంతో చివరికి భారత ఓటమి ఖరారు అయిపోయింది అని చెప్పాలి.


 ఇలా ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓడిపోయినప్పటికీ మిగతా రెండు మ్యాచ్లలో గెలవాలని అటు అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు భారత ఓటమిపై కొత్త చర్చ తెర మీదికి వచ్చింది. భారత జట్టు కావాలనే ఓడిపోయింది అంటూ ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పాక్ అభిమానులు అయితే భారత ఓటమిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ గెలిచి ఉంటే పాకిస్తాన్ కి సెమిస్ చేరే అవకాశాలు మెరుగుపడేవి. ఇక అలా జరగకుండా అటు పాకిస్తాన్ ఇంటికి పంపించాలని ఉద్దేశంతోనే భారత్ కావాలని ఓడిపోయింది అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు.


 గతంలో కూడా ఇలా టీమిండియా ఎన్నోసార్లు చేసిందని.. ఇక ఇప్పుడు కూడా కక్షపూరితంగానే భారత్ గెలవాల్సిన మ్యాచ్లో కూడా కావాలనే ఓడిపోయింది అంటూ విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం  ఇలాంటి విమర్శలను చూసి అటు భారత క్రికెట్ అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు. ఎవరికో మేలు జరుగుతుందని భారత ఆటగాళ్లు ఆడరని.. కేవలం జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని క్రికెట్ ఆడుతూ ఉంటారని.. ఇక ఇలా విమర్శలు చేస్తున్న వారికి భారత అభిమానులు కౌంటర్లు ఇస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: