టీమిండియాలోకి అతనొక్కడు వస్తే.. ఇక తిరుగుండదు : కపిల్ దేవ్
ఈ క్రమంలోనే వరల్డ్ కప్ ప్రారంభం అయిననాటి నుంచి కూడా టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నాడు. అంతేకాకుండా టీమిండియా కు పలు సూచనలు సలహాలు ఇస్తూ ఉండడం గమనార్హం ఇకపోతే ఇటీవలే టీమ్ ఇండియాలోకి ఒక ఆటగాడిని తీసుకోవాలి అంటూ కపిల్ దేవ్ సలహా ఇచ్చాడు. ఇప్పటికే పరిపూర్ణంగా ఉంది. కానీ ఇక టీమిండియాలో మరింత ఉత్తేజం నిండాలి అంటే మాత్రం రిషబ్ పంత్ లాంటి ఆటగాడు జట్టులో భాగం కావాల్సిందే అంటూ వ్యాఖ్యానించాడు.
దినేష్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ లాంటి వికెట్ కీపర్ అవసరమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. జట్టులో ఉన్నప్పటికీ వికెట్ కీపింగ్ మనకు కీలకమైనప్పుడు.. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఎంతో అవసరం అతడుంటే టీమిండియా పరిపూర్ణం అవుతుంది అంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో పాకిస్తాన్ నెదర్లాండ్స్ దక్షిణాఫ్రికా తో మ్యాచ్ లలో రాణించలేకపోయిన కేఎల్ రాహుల్ ఫామ్ పై మాట్లాడుతూ.. అతడు బాగా ఆడగలరు ఇది వరకు మ్యాచ్లో రాహుల్ బ్యాటింగ్ చూస్తే తను ఎప్పుడు కష్టపడుతున్నట్లుగా అనిపించలేదు. ఎక్కువ రన్స్ చేయడం కేఎల్ రాహుల్ కు ఎంతో కీలకం. మొదట నిదానంగా ఆడిన అవసరమైనప్పుడు వేగం పుంజుకోగలడు అంటూ మద్దతుగా నిలిచాడు కపిల్ దేవ్..