బుమ్రా స్థానంలో వస్తాడనుకుంటే.. గాయం బారిన పడ్డాడు?

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాల బెడద ఎంతలా వేధిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టి20 ప్రపంచ కప్ కు ముందు అటు జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నవారు గాయం బారిన పడుతూ దూరమవుతున్న నేపథంలో అటు టీమిండియా  అభిమానులు అందరిలో కూడా ఆందోళన మొదలైంది. ఇప్పటికే రవీంద్ర జడేజా లాంటి కీలక ఆటగాడు మోకాలు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక సర్జరీ కావడంతో కొన్ని నెలలపాటు టీం ఇండియాకు అందుబాటులో లేకుండా పోయాడు.

 ఇక మొన్నటికి మొన్న బుమ్రా కూడా ఇదే దారిలో జట్టుకు దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని మళ్ళీ జట్టులోకి వచ్చిన బుమ్రా గాయం తిరగబెట్టడంతో ఇక టి20 వరల్డ్ కప్ కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇలాంటి కీలక ఆటగాళ్లు లేకుండానే ఆస్ట్రేలియా పయనం అయింది టీమ్ ఇండియా. ఇలాంటి సమయంలో  స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికైన దీపక్ చాహర్  కూడా ఇటీవల గాయం బారిన పడ్డాడు అన్నది తెలుస్తుంది.. ప్రస్తుతం దక్షిణాఫ్రికా తో టీమ్ ఇండియా ఆడుతున్న వన్డే సిరీస్లో జట్టులో భాగమయ్యాడు దీపక్ చాహర్.

 ఇక బుమ్రా తరహాలోనే వెన్నునొప్పి గాయం కారణంగా దీపక్ చాహార్ జట్టుకు దూరం అయ్యాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే మిగిలిన రెండు వన్డే మ్యాచ్ లకు ఇక బుమ్రా స్థానంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. దీపక్ చాహర్ స్థానంలో మిగిలిన రెండు వన్డే మ్యాచ్ లలో  కూడా వాషింగ్టన్ సుందర్ ఆడబోతున్నాడు. అయితే మొన్నటికి మొన్న గాయం కారణంగానే ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు జట్టుకు దూరమైన చాహర్ ఇటీవలే మళ్లీ పునరాగమనం చేశాడు. కానీ మళ్ళీ అంతలోనే గాయం బారిన పడ్డాడు. బుమ్రా లేకపోవడంతో టి20 వరల్డ్ కప్ లో దీపక్ చాహర్ కు చోటు కల్పిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేయగా.. ఇప్పుడు అతను కూడా గాయం గాయం బారిన  పడడంతో నిరాశలో మునిగిపోయారు అందరూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: