100% ఆడే పరిస్థితి లేదు.. కానీ తప్పలేదు : హర్మన్ ప్రీత్
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలో 134 పరుగులు చేసి విజయం సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్లో ఓటమిపై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేసింది అని చెప్పాలి. మ్యాచ్ ఆడేందుకు పరిస్థితులు సరిగా లేవని... అయినప్పటికీ తప్పని సరి పరిస్థితుల్లో ఆడాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. బ్యాటింగ్ చేసినప్పుడు అనుకున్న విధంగా మేం పరుగులు చేయడంలో విఫలమయ్యాము. అయితే ఆడేందుకు పరిస్థితులు 100% పెద్దగా లేవు.
ఈ క్రమంలోనే జట్టును గెలిపించేందుకు తమ జట్టు ప్లేయర్లు ఎంతగానో కష్టపడ్డారు. కానీ అది కుదరలేదు.. అయితే ఇలాంటి పిచ్ పైన 132 పరుగులు చేయడం సాధారణ విషయం కాదు.. ఇక మా జట్టు ఆటతో సంతోషంగానే ఉన్నాను అంటూ హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది. ఇక్కడ మ్యాచ్ ఆడేందుకు మాత్రం 100% పరిస్థితులు అనుకూలంగా లేవని ఇప్పటికికూడా నమ్ముతున్నాం.. మొత్తం తడిగానే ఉంది. క్రికెటర్లు గాయపడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఇదే మ్యాచ్ లో రాధా యాదవ్ రెండో ఇన్నింగ్సులో రెండో ఓవర్లోనే గాయపడి చివరికి మైదానం వీడాల్సి వచ్చింది అనే విషయం తెలిసిందే. కీలక బౌలర్ లేకపోవడం కూడా జట్టుకు లోటు గా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది.