చైనాతో ఢీ.. చివరికి మ్యాచ్ డ్రా?
ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా మారిపోతుంది అని చెప్పాలి. అయితే హాకీ ప్రపంచ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ అటు ఇంగ్లాండుతో ఆడింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగించింది అన్న విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో చివరికి భారత్ కు విజయం వరించలేదు అని చెప్పాలి. కాగా ఇటీవలే హాకీ ప్రపంచ కప్ లో భాగంగా చైనాతో మ్యాచ్ ఆడింది భారత మహిళ హాకీ జట్టు. ఇక ఈ మ్యాచ్లో గెలిచి అటు వరల్డ్ కప్ లో భోని కొడుతుంది అని అందరూ అనుకున్నారు. ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది అన్నది తెలుస్తుంది.
మహిళల ప్రపంచ కప్ లో భాగంగా చైనాతో జరిగిన మ్యాచ్ లు కూడా భారత్ డ్రాగా ముగించింది. మొదట చైనా ప్లేయర్ జియాంగి జిల్ గోల్ కొట్టి చైనా ను ఆదిత్యం లోకి తీసుకెళ్ళింది. అయితే సెకండాఫ్ వరకు చైనాది ఆధిక్యం కొనసాగింది అని చెప్పాలి. ఇక చివర్లో భారత ప్లేయర్ వందన కటారియా గోల్ చేసి స్కోర్ సమం చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది అని చెప్పాలి. అయితే భారత్ గెలవకపోయినా ఇక ఓటమి నుంచి తప్పించుకుంది అని అటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం భారత్ పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో కొనసాగుతుండటం గమనార్హం.