కోహ్లీ షాకింగ్ రికార్డు..130 కోట్ల ఇండియన్స్ లో ఒకేఒక్కడు?

praveen
భారత క్రికెట్లో రికార్డుల రారాజు ఎవరు అంటే అందరూ ఠక్కున చెప్పేస్తారు విరాట్ కోహ్లీ అని. ఒక సాదాసీదా ఆటగాడిగా భారత జట్టు లోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ అంచనాలకు మించి తన అద్భుతమైన ప్రదర్శన తో రాణించాడు. ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ పరుగుల యంత్రం అంటూ అటు పేరు కూడా సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. అంతేకాదు ఇప్పటి వరకు ప్రపంచ కప్ క్రికెట్ లో ఎంతోమంది దిగ్గజాల క్రియేట్ చేసిన రికార్డులను అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేసి తనకు తిరుగు లేదు అని నిరూపించి అభిమానులతో రికార్డుల రారాజు అనిపించుకున్నాడు.

 ఇప్పటికీ ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ అటు క్రికెట్ లో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా ఎన్నో రికార్డులు కొల్లగొడుతూ వస్తున్నాడు. ప్రస్తుతం భారత క్రికెటర్లలో ఎవరికీ లేనంత ఫాలోయింగ్ అటు విరాట్ కోహ్లీ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఒక అరుదైన రికార్డు సాధించాడు విరాట్ కోహ్లీ. ఇంస్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ ఫాలోవర్స్ సంఖ్య 200 మిలియన్లు దాటిపోయింది. ఇక ఈ రేంజ్ లో ఫాలోవర్స్ కలిగిన ఏకైక భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమే కావడం గమనార్హం.

 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. 200 మిలియన్లు శక్తివంతం అయ్యాను నా ఇంస్టాగ్రామ్ ఫ్యామిలీ ఇస్తున్న మద్దతు ధన్యవాదాలు అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. ఇక విరాట్ కోహ్లీ కంటే ముందు ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ, క్రిస్టియన్ రోనాల్డో  ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికా తో టీ20 సిరీస్ ఆడుతుండగా.. విరాట్ కోహ్లీకి విశ్రాంతిని ఇచ్చారు అనే విషయం తెలిసిందే. ఏదిఏమైనా సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించడంతో అభిమానులు మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: